Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి కోసం దొంగగా మారిన ప్రియురాలు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (10:04 IST)
యువకుడిని గాఢంగా ప్రేమించింది. తానే అన్నీ అనుకుంది. విద్యలో అతను చూపుతున్న ప్రతిభ చూసి ఆశ్చర్యపోయింది. అయితే పైలెట్ శిక్షణలో ఉన్న యువకుడికి డబ్బు అవసరమైంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో కుమిలిపోతున్న ప్రియుడిని చూసి జాలి పడింది. తన ఇంట్లో తానే దొంగగా మారిపోయింది. 
 
గుజరాత్ లోని భక్తినగర్‌లో నివాసముంటున్న ప్రియాంకా పర్సానా, హేత్ షా గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. హేత్ షా బెంగుళూరులో పైలెట్ శిక్షణ పొందుతున్నాడు. అయితే పైలెట్ శిక్షణలో ఫీజు కట్టేందుకు 20 లక్షల రూపాయలు అవసరమైంది. నెల రోజులుగా డబ్బులు కట్టకపోవడంతో పాటు ఆవేదనకు గురయ్యాడు హేత్ షా. 
 
ప్రియుడు పడుతున్న ఆవేదనకు జాలిపడింది ప్రియాంకా. తన ఇంట్లో ఉన్న 90 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలను దొంగతనం చేసి హేత్ షాకు ఇచ్చింది. బీరువాను చిందర వందర వేసి దొంగతనం జరిగిందని కట్టు కథ అల్లింది. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరిపి దొంగ తన కూతురేనని తేల్చారు. దీంతో తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments