Webdunia - Bharat's app for daily news and videos

Install App

షేక్ హ్యాండ్ ఇచ్చిన షర్మిల.. ఉంగరాన్ని గుంజుకున్న దొంగ(Video)

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (09:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఈ ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో ఆయన సోదరి వైఎస్. షర్మిల, తల్లి వైఎస్. విజయమ్మ, భార్య వైఎస్ భారతిలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నలుగురు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. 
 
ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపు కోసం వీరంతా తమవంతు కృషి చేస్తుంటే దొంగలు మాత్రం తమపనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అభిమానులకు వైఎస్ షర్మిల షేక్ హ్యాండ్ ఇస్తున్న సమయంలో ఒక దొంగ ఏకంగా ఆమె ఉంగరాన్ని గుంజుకున్నాడు. 
 
మూడురోజుల క్రితం ఏపీలో ప్రచారాన్ని మొదలుపెట్టిన షర్మిల ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆమె వాహనంలో నుంచి అభిమానులకు అభివాదం చేస్తుండగా.. కార్యకర్తలు ఆమెతో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. ఆమె కూడా నవ్వుతూ వారికి చేతులు అందిస్తూ షేక్‌హ్యాండ్ ఇచ్చారు. 
 
అదే అదునుగా భావించిన ఓ దొంగ కార్యకర్త ఆమె చేతి ఉంగరంపై గురిపెట్టాడు. ఇంకేమున్నది.. చెయ్యి అందగానే ఆమె వేలికి ఉన్న ఉంగరాన్ని బలవంతంగా లాగాడు. షర్మిల కూడా ఉంగరాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ దృశ్యాలన్నీ ఒక వ్యక్తి కెమెరాలో బంధించి.. సోషల్ మీడియాలోకి వదలడంతో వైరల్ అయింది. వీడియో...

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments