Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మకు అన్నం పెట్టడు గానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట : వైఎస్.షర్మిల

అమ్మకు అన్నం పెట్టడు గానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట : వైఎస్.షర్మిల
, శనివారం, 30 మార్చి 2019 (17:01 IST)
అమ్మకు అన్నం పెట్టడుగానీ, చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట అన్న చందంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఖరి ఉందని వైకాపా మహిళా నేత వైఎస్. షర్మిల అన్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఆమె శనివారం గుంటూరు సిటీలో జరిగిన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
అమ్మకు అన్నం పెట్టడు గానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్న చందంగా.. ఐదేళ్లుగా ప్రజలను పట్టించుకోని నారా చంద్రబాబు నాయుడు ఇప్పడు మరొక్కసారి దగా చేయడానికి అవకాశం ఇవ్వామనడం విడ్డూరంగా ఉందని షర్మిల ఎద్దేవా చేశారు. 
 
రైతు రుణమాఫీ పేరుతో బాబు రైతున్నలను మోసం చేశారని, ఇటు డ్వాక్రా మహిళలను కూడా రుణమాఫీ పేరుతో మోసం చేశారని విమర్మించారు. కాగా ఇప్పుడు పసుపు-కుంకుమ పేరుతో మరో కొత్త డ్రామా మొదలుపెట్టారని మండిపడ్డారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారు కానీ ఆ జాబు బాబు కుమారుడు లోకేష్‌కే వచ్చిందనీ, రాష్ట్రంలోని నిరుద్యోగుల్లో ఒక్కరికీ కూడా జాబు రాలేదన్నారు. 
 
ఇకపోతే, పప్పు బాబుకు వర్ధంతికి, జయంతికి తేడా తెలియదన్నారు. ఒక్క ఎన్నిక కూడా గెలవకుండా మూడు శాఖలకు మంత్రి అయ్యారు. బాబుది రోజుకో మాట.. పూటకో వేషం అని ఎద్దేవా చేశారు. బాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుతో పారిపోతుందన్నారు. వైసీపీకి పొత్తులు అవసరం లేదు.. సింహం సింగిల్‌గానే వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రచారంలో దురుసు ప్రవర్తన : నన్నే ప్రశ్నిస్తావా? కార్యకర్తను తోసేసిన బాలయ్య