వినాయక చవితి రోజున ఎరుపు రంగు గణనాథుడిని పూజిస్తే?

గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోవాలంటే వినాయక చవితి రోజున గణనాథుడిని పూజించాలని పండితులు చెప్తున్నారు. ఉద్యోగంలో స్థిరపడకపోవడం, వివాహ అడ్డంకులు, ఉద్యోగం చేసే ప్రదేశంలో సహచరుల నుంచి ఇబ్బందు

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (17:04 IST)
గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోవాలంటే వినాయక చవితి రోజున గణనాథుడిని పూజించాలని పండితులు చెప్తున్నారు. ఉద్యోగంలో స్థిరపడకపోవడం, వివాహ అడ్డంకులు, ఉద్యోగం చేసే ప్రదేశంలో సహచరుల నుంచి ఇబ్బందులను ఎదుర్కోవడం వంటి సమస్యలను దూరం చేసుకోవాలంటే.. వినాయక చవితి రోజున బ్రాహ్మీ ముహూర్తమున నిద్రలేవాలి.


శరీరానికి నువ్వుల నూనెతో నలుగు పెట్టుకుని.. అరగంట తర్వాత స్నానం చేయాలి. ఆపై ఎరుపు రంగు వినాయకుడిని పూజించాలి. స్వామి వారికి ఎరుపు రంగు పూల మాలతో అలంకరించాలి. 
 
ఉలవ గుగ్గుల్లు, పాలతో తయారు చేసిన ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించాలి. దీపారాధనకు ముందుగా ''ఓం హరసూనవే నమః'' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తర్వాత నేతితో దీపారాధన చేసి.. పూజకు తర్వాత ప్రసాదాలను పేదలకు దానం చేయాలి.

కనీసం బాలుడికైనా వస్త్రదానం చేయాలి. ఇంకా వినాయక ఆలయంలో ఆ రోజు మీకు చేతనైన సేవ చేస్తే మంచి ఫలితం వుంటుందని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోతిని తోలుతూ హైవోల్టేజ్ విద్యుత్ వైర్లు తగలడంతో భగ్గున మండిపోయాడు, వీడియో

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు- పవన్ కళ్యాణ్

విశాఖలో ఘోరం, పార్టీకి పిలిచి స్నేహితురాలిని చంపేసిన ఫ్రెండ్స్, రాత్రి ఆ హోటల్లో ఏం జరిగింది?

నాలుగు చినుకులు పడితే అమరావతి రాజధాని నిర్మాణం ఆగిపోతుంది: పేర్ని నాని

శుభవార్త చెప్పిన డోనాల్డ్ ట్రంప్.. చమురు ధరలు భారీగా తగ్గుగాయ్...

అన్నీ చూడండి

లేటెస్ట్

13-04-2026 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి ఆశాజనకం.. పరిస్థితులు చక్కబడతాయి...

12-04-2026 ఆదివారం ఫలితాలు - ఏ పనీ చేయబుద్ధికాదు

12-04-2026 నుంచి 18-04-2026 వరకు మీ వార ఫలితాలు

ఐదు అత్యుత్తమ మంత్రాలు ఏవి.. శనివారం ఈ మంత్రాలను జపిస్తే?

11-04-2026 శనివారం ఫలితాలు - ఆర్ధిక ఇబ్బందులు అధికం

తర్వాతి కథనం
Show comments