Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయకచవితి రోజున ఎవరైతే చంద్రుడిని చూస్తారో?

గణపతి సకల దేవతలకు గణ నాయకడు. ఎవరు ఏ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ముందుగా గణపతిని పూజిస్తుంటారు. బ్రహ్మదేవుడు సైతం తన సృష్టి రచనకు ముందుగా గణపతిని పూజించినట్లుగా చెప్పబడింది. అటువంటి వినాయకుని పుట్ట

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (15:29 IST)
గణపతి సకల దేవతలకు గణ నాయకడు. ఎవరు ఏ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ముందుగా గణపతిని పూజిస్తుంటారు. బ్రహ్మదేవుడు సైతం తన సృష్టి రచనకు ముందుగా గణపతిని పూజించినట్లుగా చెప్పబడింది. అటువంటి వినాయకుని పుట్టిన రోజైన భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితి పండుగగా అందరూ జరుపుకుంటారు.
  
 
గజముఖుడనే రాక్షసుడు పరమ శివుని తన తపస్సుచే మెప్పించి ఆ స్వామి ఉదరంలో ఉండే విధంగా వరాన్ని పొందుతాడు. ఈ విషయంపై పార్వతీ దేవి ఆందోళనను శ్రీ మహా విష్ణువునకు తెలియజేశారు. అప్పుడు విష్ణువు నందిగా, బ్రహ్మ గంగిరెద్దుగా మారుతారు. విష్ణువు బ్రహ్మ గంగిరెద్దును ఆడించువారిలా వెళ్ళి ఆ గజముఖుని నివాస ప్రాంతానికి చేరుకున్నారు. ఆ రాక్షసుడు గంగిరెద్దును చిత్ర విచిత్రాలుగా ఆడించాడు.  
 
గజముఖుడు ఆ సమయంలో సంతోషించి ఏం కావాలో కోరుకోమని అడిగాడు. నీ కడుపులో గల శివునిని ప్రసాదించమని వారు కోరుతారు. అప్పుడు గజముఖుడు వచ్చిన వారు ఎవరనేది తెలుసుకుంటాడు. దాంతో తన శిరస్సు పరమ పూజనీయం కావాలనీ, తన చర్మం శివుడు ధరించాలనే వరాలను కోరి శివుడిని వారికి అప్పగించి తన ప్రాణాలు వదలుతాడు. 
 
కైలాసంలో పార్వతీ శివుని కోసం ఎదురుచూస్తూ నలుగుపిండితో స్నానానికి వెళుతూ నలుగుపిండితో ఒక బాలుడిని తయారచేసి దానికి ప్రాణం పోసి వాకిట్లో కాపలాగా ఉంచి వెళుతుంది. అంతలో అక్కడికి శివుడు రాగా ఆ బాలుడు ఆయనను అడ్డుకున్నాడు. కోపానికి లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంచే ఖండించారు. ఆ శబ్దానికి పార్వతి బయటకు వచ్చి జరిగిన ఘోరాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. 
 
దాంతో శివుడు గజముకుని శిరస్సును తెప్పించి ఆ బాలునికి అతికించి ప్రాణం పోసి అతనికి గజాననడు అనే పేరును పెట్టాడు. ఆ బాలుడి శక్తి సామర్ధ్యాలను పరిశీలించిన శివుడు అతనిని గణాధిపతిగా పరిగణించారు. దాంతో దేవతలు గణేశునికి విందు భోజనం ఏర్పాటు చేస్తారు. ఆ విందును కడుపారా భోంచేసిన గణపతి నడవడానికి పడుతున్న అవస్థను చూసి శివుని శిరస్సున గల చంద్రుడు నవ్వుతాడు. దాంతో గణపతికి దిష్టి తగిలి పొట్ట పగిలిపోతుంది. తన కుమారుడిని తిరిగి బ్రతికించుకున్న ఆ తల్లి పార్వతీ దేవి భాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వారు నీలాపనిందలను ఎదుర్కుంటారని శపిస్తుంది. 
 
ఐతే దేవతలంతా కలిసి పార్వతికి నచ్చచెప్పడంతో ఆ రోజున వినాయకవ్రత కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకున్న వారికి ఈ శాపం వర్తించదని చెపుతుంది. ఐతే పాల పాత్రలో ఆ రోజున చంద్రుడిని చూసినందుకు గాను శ్రీ కృష్ణుడంతటి వారు కూడా నీలాపనిందలను మోయవలసి వచ్చింది. ఈ ప్రభావాన్ని గుర్తించిన దేవతలు, మానవులు ఈ రోజున వినాయకుడిని పూజించి ఆయనకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించసాగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్ఎంపీ ఇంటి తాళం పగులకొట్టి బంగారం కొట్టేశాడు.. దొంగ ఎవరంటే?

బర్త్ డే కేక్ మీద కొవ్వొత్తి, స్ప్రే కొడుతుండగా ముఖానికి అంటుకున్న మంట (video)

నలుగురు కుమారులు-చిప్స్, కూల్ డ్రింక్స్ తీసిచ్చి రైలు కింద తోసేసిన తండ్రి.. ఆపై?

నాలుగో తరగతి గొడవ - 62 యేళ్ళ వయసులో కొట్టుకున్నారు...

Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు భారీ ఊరట

అన్నీ చూడండి

లేటెస్ట్

08-06-2025 నుంచి 14-06-2025 వరకు ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మొద్దు

07-06-2025 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచొద్దు...

Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?

నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?

06-06-2025 శుక్రవారం దినఫలితాలు - చెల్లింపుల్లో జాప్యం తగదు...

తర్వాతి కథనం
Show comments