Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్ 2021: ఎంపీలకు ఫైవ్‌స్టార్ హోటల్ నుంచి భోజనం..

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (17:51 IST)
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న క్రమంలో ఈసారి ఓ కీలక మార్పు చోటుచేసుకోనుంది. గత 52 ఏళ్లుగా ఎన్నడూ లేనిది ఎంపీలకు నార్త్‌ర్న్‌ రైల్వేలు కాకుండా ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ నుంచి భోజనం రప్పిస్తారు. బడ్జెట్‌ రోజున పార్లమెంటేరియన్లకు ఇండియా టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఐటీడీసీ) భారీ విందు ఏర్పాటు చేసింది. 
 
ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ కలిగిన అశోక్‌ హోటల్‌ నుంచి ఎంపీలకు చేయితిరిగిన చెఫ్‌లు సిద్ధం చేసిన వంటను వడ్డించనున్నారు. పార్లమెంట్‌కు సరఫరా చేసే ఫుడ్‌ను అశోక్‌ హోటల్‌ నిర్ధేశించిన ధరలకు కాకుండా సబ్సిడీపై అందిస్తారు.
 
కడై పనీర్‌, మిక్స్డ్‌ వెజ్‌ డ్రై, బజ్జీ, దాల్‌ సుల్తాని, పీస్‌ పులావ్‌, చపాతి, గ్రీన్‌ సలాడ్‌, రైతా, పాపడ్‌, కాలా జామూన్‌తో కూడిన వెజ్‌ ప్లేటర్‌ వంద రూపాయలకు అందిస్తారు. ఇక మినీ తాలీకి రూ.50 వసూలు చేస్తారు. 
 
స్నాక్స్‌, వెజ్‌, మినీ తాలి వంటి ఏడు రకాల మీల్స్‌తో కూడిన స్పెషల్‌ మెనూ అందుబాటులో ఉంది. కాగా, 1968 నుంచి పార్లమెంట్‌కు ఆహారం సమకూరుస్తున్న నార్తర్న్‌ రైల్వేల స్ధానంలో గత ఏడాది నవంబర్‌లో ఐటీడీసీ ఆ బాధ్యతలను చేపట్టింది.

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం