Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2021-22లో జీడీపీ వృద్ధిరేటు 11 శాతం : విత్తమంత్రి నిర్మలా సీతారామన్

2021-22లో జీడీపీ వృద్ధిరేటు 11 శాతం : విత్తమంత్రి నిర్మలా సీతారామన్
, శుక్రవారం, 29 జనవరి 2021 (15:12 IST)
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఆ తర్వాత విత్తమంత్రి నిర్మలా సీతారామన్ సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 
 
2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో జీడీపీ వృద్ధి రేటు 11 శాతంగా ఉంటుంద‌ని ఈ ఆర్థిక స‌ర్వే అంచ‌నా వేసింది. దేశ‌వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఆర్థిక స‌ర్వే ఈ అంచ‌నాకు వ‌చ్చింది. ఇక 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో వృద్ధి రేటు -7.7 శాతంగా ఉంటుంద‌ని కూడా చెప్పింది. 
 
కరనా కష్టకాలం తర్వాత ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌ళ్లీ సాధార‌ణ స్థాయికి చేరుకుంటోంద‌ని, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కావ‌డంతో సేవ‌లు, వినియోగం, పెట్టుబ‌డుల రంగాలు చాలా వేగంగా పుంజుకుంటాయ‌ని స‌ర్వే తెలిపింది.
 
గ‌తేడాది కొవిడ్ కార‌ణంగా ఒక్క వ్య‌వ‌సాయ రంగం త‌ప్ప మిగిలిన కాంటాక్ట్ ఆధారిత సేవ‌లు, త‌యారీ, నిర్మాణ రంగాలు తీవ్రంగా న‌ష్ట‌పోయిన‌ట్లు ఈ స‌ర్వే తేల్చింది. ఈ ఏడాది ప్ర‌భుత్వం త‌న 3.5 శాతం ద్ర‌వ్య‌లోటు ల‌క్ష్యాన్ని చేరుకోక‌పోవ‌చ్చ‌ని కూడా ఆర్థిక స‌ర్వే అంచ‌నా వేసింది. గ‌తేడాది -23.9 శాతానికి ప‌త‌న‌మైన వృద్ధి రేటు త‌ర్వాత మెల్ల‌గా కోలుకున్న విష‌యం తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిమ్మగడ్డను పిచ్చాసుపత్రికి తరలించాలి : వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి