Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. కరోనా పరీక్షలు.. రాష్ట్రపతి ప్రసంగం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. కరోనా పరీక్షలు.. రాష్ట్రపతి ప్రసంగం
, శుక్రవారం, 29 జనవరి 2021 (10:51 IST)
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. తొలుత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఉభయ సభలను ఉద్ధేశించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ దేశ బడ్జెట్‌ను సమర్పిస్తారు. బడ్జెట్ సెషన్ కోసం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరిగాయి. భద్రత దృష్ట్యా, బడ్జెట్ సెషన్‌కు ముందు సభ్యులందరికీ, ఉద్యోగులకూ కరోనా పరీక్షను తప్పనిసరి చేశారు.
 
ఈ సందర్భంగా 1,209 మంది అధికారులు, సచివాలయ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికి నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి. రాష్ట్రపతి ప్రసంగం శుక్రవారం ఉదయం 11.00 నుంచి ప్రారంభమవుతుంది. సెంట్రల్ హాల్‌లో 144 మంది పార్లమెంటు సభ్యులు, మంత్రుల మండలి, లోక్‌సభ, రాజ్యసభ ప్రత్యేక కమిటీల ఛైర్‌పర్సన్స్, ఉభయ సభల్లోని వివిధ పార్టీలు, గ్రూపుల నాయకులు, మాజీ ప్రధాని, జాతీయ అధ్యక్షుడు ఉంటారు.
 
సభ్యులందరూ ఒకరికొకరు 6 అడుగుల దూరంలో కూర్చుంటారు. రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా పార్లమెంటు సభ్యులు సెంట్రల్ హాల్‌తో పాటు లోక్‌సభ, రాజ్యసభల్లో కూర్చోవడం ఇదే మొదటిసారి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దక్షిణాదిలో భిన్నమైన కరోనా వైరస్ .. సీసీఎంబీ :: సౌతాఫ్రికాలో స్ట్రెయిన్