Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్‌లో దారుణం.. బాలికపై అధ్యాపకుడి హత్యాచారం.. ఎవరూ లేని తరగతి గదిలో..?

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (17:02 IST)
మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. జార్ఖండ్‌లో ఓ బాలికపై అధ్యాపకుడు హత్యాచారానికి పాల్పడ్డాడు. అది కూడా గణతంత్ర దినోత్సవం రోజునే ఈ ఘటన చోటుచేసుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే.. పలమౌ జిల్లా పంకికి చెందిన బాలిక ఈనెల 26న పాఠశాలకు వెళ్లింది. 
 
ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శంభు సింగ్‌(35) ఆ బాలికను ఎవరూ లేని తరగతి గదికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. తర్వాత.. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పొద్దంటూ బాలికను, ఆమె తల్లిదండ్రులను బెదిరించాడు. అదేరోజు రాత్రి విద్యార్థిని ఇంటికి వెళ్లిన అతను బాలికకు విషపు గుళికలు తినిపించాడు. 
 
కొద్దిసేపటికి ఆ బాలిక అపస్మారక స్థితికి వెళ్లింది. తల్లిదండ్రులు తమ కూతురిని ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె మరణించింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. బాధిత కుటుంబానికి, ఉపాధ్యాయుడికి మధ్య భూతగాదాలున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments