Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్‌లో దారుణం.. బాలికపై అధ్యాపకుడి హత్యాచారం.. ఎవరూ లేని తరగతి గదిలో..?

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (17:02 IST)
మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. జార్ఖండ్‌లో ఓ బాలికపై అధ్యాపకుడు హత్యాచారానికి పాల్పడ్డాడు. అది కూడా గణతంత్ర దినోత్సవం రోజునే ఈ ఘటన చోటుచేసుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే.. పలమౌ జిల్లా పంకికి చెందిన బాలిక ఈనెల 26న పాఠశాలకు వెళ్లింది. 
 
ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శంభు సింగ్‌(35) ఆ బాలికను ఎవరూ లేని తరగతి గదికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. తర్వాత.. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పొద్దంటూ బాలికను, ఆమె తల్లిదండ్రులను బెదిరించాడు. అదేరోజు రాత్రి విద్యార్థిని ఇంటికి వెళ్లిన అతను బాలికకు విషపు గుళికలు తినిపించాడు. 
 
కొద్దిసేపటికి ఆ బాలిక అపస్మారక స్థితికి వెళ్లింది. తల్లిదండ్రులు తమ కూతురిని ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె మరణించింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. బాధిత కుటుంబానికి, ఉపాధ్యాయుడికి మధ్య భూతగాదాలున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments