Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్ 2020, ఉద్యోగులకు ఊరటనిచ్చేందుకు మోదీ సర్కార్ కసరత్తు... ఏంటి?

Webdunia
శుక్రవారం, 24 జనవరి 2020 (14:06 IST)
బడ్జెట్ 2020కి మరికొన్ని రోజులే సమయం వుంది. బడ్జెట్ అనగానే వేతన జీవులు ఎంతో ఆశగా, ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అదే... ఆదాయపన్ను మినహాయింపు ఎంతమేరకు వుంటుందనేది. కాస్త వెసులుబాటు కల్పిస్తే తమ జీవితం మరింత సాఫీగా వుంటుందని ఆశపడటం సహజమే.

గత ఏడాది ప్రవేశపెట్టిన టాక్స్ శ్లాబుల వల్ల వేతన జీవులపై పన్ను బాదుడు అంత తక్కువేమీ లేదన్న వాదనలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఈసారి మరికాస్త కసరత్తు చేసి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంచుతారనే వార్తలు వస్తున్నాయి.
 
ఇప్పుడు బేసిక్‌ మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా వుండగా దీన్ని రూ 3 లక్షలు లేదా రూ 3.5 లక్షలకు పెంచుతారని అంచనా వేస్తున్నారు. ఆదాయపన్ను శ్లాబులు, పన్ను రేట్లలో మార్పులు తీసుకొచ్చేందుకు మంత్రి నిర్మలా సీతారామన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఆ ప్రకారం ఈసారి రూ.7 లక్షల దాకా ఆదాయం ఉన్న వారికి 5 శాతంగా పన్ను వుండనుందని అంచనా. అలాగే 7 నుంచి 10 లక్షల ఆదాయం ఉన్న వారికి 10 శాతం పన్ను విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఉన్న 5, 20, 30 శాతం శ్లాబులు పన్ను భారాన్ని విపరీతంగా పెంచుతున్నట్లు ప్రభుత్వం నిర్ధారణకు వచ్చిన నేపధ్యంలో ఈమేరకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments