Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేసీనా మజాకా.. ఈసారి జగన్‌ను పొగిడారు.. ఎందుకంటే?

Webdunia
శుక్రవారం, 24 జనవరి 2020 (13:03 IST)
ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ చర్చకు తెరదీస్తుంటారు అనంతపురం మాజీ ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి. జె.సి.ఎప్పుడు ఏదీ మాట్లాడిన అది సంచనలమే. టిడిపిలో ఉండి ఆ పార్టీ నేతలను తిట్టడం ఆయనకు అలవాటు. అంతేకాదు ఎవరినైనా కడిగిపారేయడం జె.సి.కి ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. ఎపి రాజధాని వ్యవహారంపై ఇప్పటికే చాలాసార్లు స్పందించారు జె.సి. అయితే ఆయన స్పందించిన తీరు ఒక్కోసారి ఒక్కోరకంగా ఉండేది. 
 
తాజాగా మూడు రాజధానుల ప్రకటనపై ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన వామపక్షాలు తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూడు రాజధానులపై జేసీ దివాకర్ రెడ్డి మరోసారి స్పందించారు. ఇంత చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు తీసుకురావడంవల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని అన్నారు. అయితే శాసనసభ తీర్పును అందరు గౌరవించాల్సిందేనని అన్నారు.
 
మూడు రాజధానులు ఏర్పాటు చేయడం అంతసులభతరం కాదన్న జెసి.. మనిషికి తలకాయ రాజధాని అయితే బ్రెయిన్ సెక్రటరియేట్  అన్నారు. బ్రెయిన్‌ను తీసుకువెళ్లి జగన్ విశాఖపట్నంలో పెడుతున్నారని జేసీ అన్నారు. దేశంలో కేంద్రం కోర్టులు ఉన్నాయని ఏం జరుగుతుందో చూద్దామని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments