Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పెషల్ స్టేటస్ డిమాండ్ : వైకాపా ఎంపీల రాజీనామాలు ఆమోదం

వైకాపాకు చెందిన ఐదుగురు ఎంపీలు చేసిన రాజీనామాలపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదముద్రవేశారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ ఐదుగురు

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (18:59 IST)
వైకాపాకు చెందిన ఐదుగురు ఎంపీలు చేసిన రాజీనామాలపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదముద్రవేశారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ ఐదుగురు ఎంపీలు రాజీనామాలు చేసిన విషయం తెల్సిందే.
 
వాస్తవానికి ఈ రాజీనామాలు గత ఏప్రిల్ 6వ తేదీన చేశారు. ఆ తర్వాత ఈ రాజీనామాలను పరిశీలించిన లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్... ఆ ఐదుగురు ఎంపీలను పిలిచి ప్రత్యేకంగా మాట్లాడారు. అపుడు కూడా రాజీనామాలకు కట్టుబడివున్నట్టు వారు తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో వారి రాజీనామాలను స్పీకర్ గురువారం ఆమోదించారు. ఈ రాజీనామాలు చేసిన వారిలో వైవీ సుబ్బారెడ్డి (ఒంగోలు), వరప్రసాద్ (తిరుపతి) మేకపాటి రాజమోహన్ రెడ్డి (నెల్లూరు), మిథున్ రెడ్డి (రాజంపేట), వైఎస్ అవినాష్ రెడ్డి (కడప)లు ఉన్నారు. అయితే, వీరి రాజీనామాలు ఆమోదించినప్పటికీ.. ఈ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహంచే అవకాశం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments