చికాగో వ్యభిచారం దందా వెనుక తెలుగు తమ్ముళ్లు : వాసిరెడ్డి పద్మ

ఇటీవల అమెరికాలోని చికాగోలో వెలుగు చూసిన వ్యభిచార దందా వెనుక తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఉన్నారని వైకాపా ఎమ్మెల్యే వాసిరెడ్డి పద్మ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె గురువారం విలేకరులతో మాట్లాడుతూ, ఈ వ్యభి

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (18:14 IST)
ఇటీవల అమెరికాలోని చికాగోలో వెలుగు చూసిన వ్యభిచార దందా వెనుక తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఉన్నారని వైకాపా ఎమ్మెల్యే వాసిరెడ్డి పద్మ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె గురువారం విలేకరులతో మాట్లాడుతూ, ఈ వ్యభిచార దందాను టీడీపీలోని వ్యక్తులు, ఆ పార్టీలోని సన్నిహితులు నడుపుతున్నారని ఆరోపించారు. 
 
ఈ వ్యభిచార రాకెట్ వల్ల తెలుగువారి పరువు అంతర్జాతీయంగా పోయిందన్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ నేత విచారణపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తానా అధ్యక్షుడు వేమన సతీష్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) ప్రశ్నించినట్టు  తెలుస్తోందని, చంద్రబాబు, లోకేష్‌లకు ఆయన అత్యంత సన్నిహితుడని ఆమె ఆరోపించారు. 
 
కాగా, ఇటీవల చికాగోలో వెలుగు చూసిన వ్యభిచార దందాకు సూత్రధారులు మొదుగమూడి కిషన్, ఆయన భార్య మొదుగుమూడి చంద్రలు ప్రధాన సూత్రధారులు కావడంతో వారిద్దరనీ యూఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో పలువురు హీరోయిన్లకు కూడా సంబంధం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

CAT మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు

అకీరా నందన్‌కు ఊరట... ఏఐ లవ్ స్టోరీపై తాత్కాలిక నిషేధం

డా. ఎం. మోహన్ బాబు కు బెంగాల్ ప్రభుత్వ గవర్నర్ ఎక్స్‌లెన్స్ అవార్డు

ఉస్తాద్ భగత్ సింగ్ డబ్బింగ్ పనులు ప్రారంభం, త్వరలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ

పవన్ కళ్యాణ్ తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం : నటి భూమిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్, ఏంటవి?

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments