Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర్‌నాథ్ యాత్రికులపై దాడులు చేయం.. ఉగ్రవాదుల్లో మానవత్వం

పవిత్ర అమర్‌నాథ్ యాత్ర కోసం వచ్చే యాత్రికులపై దాడి చేసేది లేదని ఉగ్రవాదులు ప్రకటించారు. మంగళవారం (జూన్-26) అర్థరాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్ర కోసం వచ్చే భక్తులు, పర్యాటకులపై దా

Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (17:16 IST)
పవిత్ర అమర్‌నాథ్ యాత్ర కోసం వచ్చే యాత్రికులపై దాడి చేసేది లేదని ఉగ్రవాదులు ప్రకటించారు. మంగళవారం (జూన్-26) అర్థరాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్ర కోసం వచ్చే భక్తులు, పర్యాటకులపై దాడి చేయమని.. భక్తులు భయపడాల్సిన అవసరం లేదని హిజ్బుల్ ముజాహిద్దీన్ ఆపరేషనల్ కమాండర్ రియాజ్ అహ్మద్ నైకూ పేరుతో విడుదలైన ఆడియోలో ఉగ్రవాదులు ప్రకటన చేశారు. గత ఏడాది దాడులు జరగటంతో ఈసారి భద్రత పెంచింది ప్రభుత్వం. దీంతో భక్తుల్లో కూడా భయాందోళనలు ఉన్నాయి. 
 
ఈ సమయంలో ఉగ్రవాదులు చేసిన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ''మీకు భద్రత అవసరం లేదు. మీరు మా అతిథులు. వాళ్లు తమ మత విశ్వాసాలకు అనుగుణంగా ఇక్కడికి వస్తున్నారు. మేం ఎలాంటి దాడి ప్రణాళిక రచించలేదని'' నైకూ ఆడియో ద్వారా తెలిపాడు. 
 
అమరనాథ్ యాత్రపై దాడులు చేయం అంటూ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉగ్రవాదుల్లోనూ మంచి వాళ్లు ఉంటారా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఉగ్రవాద సంస్థ నుంచి హామీ వచ్చినా.. భద్రత విషయంలో రాజీ పడేది లేదని జమ్మూకాశ్మీర్ డీజీపీ వాయిద్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments