Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర్‌నాథ్ యాత్రికులపై దాడులు చేయం.. ఉగ్రవాదుల్లో మానవత్వం

పవిత్ర అమర్‌నాథ్ యాత్ర కోసం వచ్చే యాత్రికులపై దాడి చేసేది లేదని ఉగ్రవాదులు ప్రకటించారు. మంగళవారం (జూన్-26) అర్థరాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్ర కోసం వచ్చే భక్తులు, పర్యాటకులపై దా

Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (17:16 IST)
పవిత్ర అమర్‌నాథ్ యాత్ర కోసం వచ్చే యాత్రికులపై దాడి చేసేది లేదని ఉగ్రవాదులు ప్రకటించారు. మంగళవారం (జూన్-26) అర్థరాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్ర కోసం వచ్చే భక్తులు, పర్యాటకులపై దాడి చేయమని.. భక్తులు భయపడాల్సిన అవసరం లేదని హిజ్బుల్ ముజాహిద్దీన్ ఆపరేషనల్ కమాండర్ రియాజ్ అహ్మద్ నైకూ పేరుతో విడుదలైన ఆడియోలో ఉగ్రవాదులు ప్రకటన చేశారు. గత ఏడాది దాడులు జరగటంతో ఈసారి భద్రత పెంచింది ప్రభుత్వం. దీంతో భక్తుల్లో కూడా భయాందోళనలు ఉన్నాయి. 
 
ఈ సమయంలో ఉగ్రవాదులు చేసిన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ''మీకు భద్రత అవసరం లేదు. మీరు మా అతిథులు. వాళ్లు తమ మత విశ్వాసాలకు అనుగుణంగా ఇక్కడికి వస్తున్నారు. మేం ఎలాంటి దాడి ప్రణాళిక రచించలేదని'' నైకూ ఆడియో ద్వారా తెలిపాడు. 
 
అమరనాథ్ యాత్రపై దాడులు చేయం అంటూ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉగ్రవాదుల్లోనూ మంచి వాళ్లు ఉంటారా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఉగ్రవాద సంస్థ నుంచి హామీ వచ్చినా.. భద్రత విషయంలో రాజీ పడేది లేదని జమ్మూకాశ్మీర్ డీజీపీ వాయిద్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఔరంగజేబు పాత్రలో ఒదిగిపోయిన బాబీ డియోల్ : దర్శకుడు జ్యోతి కృష్ణ

Naresh: అల్లరి నరేష్ కథానాయకుడిగా ఆల్కహాల్ టైటిల్ ఖరారు

శ్రీహరి కొడుకు ధనుష్ హీరోగా థాంక్యూ డియర్ చిత్ర టీజర్ లాంచ్ చేసిన వినాయక్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments