తిరుమల ఇలా కూడా వుంటుందా? ఆశ్చర్యంలో జనం...

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (23:37 IST)
కరోనా వైరస్ దెబ్బతో ఆలయాలన్నీ మూతపడిన విషయం తెలిసిందే. అయితే తిరుమల శ్రీవారి ఆలయాన్ని మాత్రం తెరిచి ఉంచిన అధికారులు భక్తులను దర్సనానికి అనుమతించడం మానేశారు. తిరుపతి నుంచి తిరుమలకు జనం అస్సలు వెళ్ళడం లేదు. అంతేకాదు 128 సంవత్సరాల తరువాత తిరుమల నిర్మానుష్యంగా మారిపోయింది. 
 
తిరుమల ఇలా కూడా ఉంటుందా అంటూ ఆశ్చర్యంగా చూస్తున్నారు బాలాజీనగనర్ లోని స్థానికులు. అయితే మొదట్లో వారంరోజుల పాటు ఆలయంలో భక్తులను దర్సనానికి అనుమతించకూడదని నిర్ణయించుకున్నారు. కానీ ఆ తరువాత వైరస్ ప్రబలతున్న నేపథ్యంలో ఈనెల 31వ తేదీ వరకని టిటిడి ఉన్నతాధికారులు ప్రకటించారు.
 
కానీ పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. రోజు రోజుకు వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో పాటు ప్రజల్లో భయాందోళన కనిపిస్తుండడంతో మరికొన్ని రోజుల పాటు ఆలయాన్ని తెరిచి భక్తులను దర్సనానికి పంపించకూడదన్న నిర్ణయానికి టిటిడి వచ్చేసినట్లు తెలుస్తోంది.
 
ఏప్రిల్ 10వతేదీ వరకు దర్సనాన్ని పూర్తిగా నిలిపివేయాలన్న నిర్ణయానికి టిటిడి ఉన్నతాధికారులు వచ్చేశారట. తిరుమల లాంటి ఆధ్మాత్మిక క్షేత్రంలో భక్తులను అనుమతించకుండా ఉండడం చాలా యేళ్ళ తరువాత ఇదే ప్రథమమట. గతంలో 1892వ సంవత్సరంలో ఆలయాన్ని మూసివేశారట. రెండురోజుల మాత్రమే ఆలయాన్ని మూసివేశారట.
 
ఆ తరువాత అంటే సరిగ్గా 128యేళ్ళ తరువాత ఇప్పుడే ఆలయాన్ని తెరిచి భక్తులను అనుమతించకపోవడం. ఈసారి ఇన్నిరోజులు భగవంతుడిని భక్తులకు దూరం చేయడం చరిత్రగా నిలిచిపోతుంది అంటున్నారు టిటిడి అధికారులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

నారీ నారీ నడుమ మురారి టికెట్లు ఎంఆర్‌పీ ధరలకే : నిర్మాత అనిల్ సుంకర

మీకే చెప్పేది, మా ఇద్దర్నీ వీడియో తీయొద్దు: ఫోటోగ్రాఫర్లపై కృతి సనన్ ఆగ్రహం

Maruti: రాజా సాబ్ గా ప్రభాస్ ని కొత్తగా చూపించాననే ప్రశంసలు వస్తున్నాయి : మారుతి

సుమతీ శతకం నుండి అమర్దీప్ చౌదరి డాన్స్ తో తొలి సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వీక్యురా రీస్కల్ప్ట్

తర్వాతి కథనం
Show comments