Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిదంబరం అరెస్టుకు ఆమే కారణమా? చిద్దూను 5 రోజులు అప్పగించాలంటే...

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (18:58 IST)
ఐఎన్ ఎక్స్ మీడియా స్కాంలో ఇంద్రాణి ముఖర్జీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీ సహ నిందితులు. ఐఎన్ ఎక్స్ మీడియాను 2007లో స్థాపించారు ఈ దంపతులు. ఆ సమయంలో చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రి. విదేశీ పెట్టుబడులు చిదంబరం పర్యవేక్షణలోనే ఉండేది. దీంతో చిదంబరం కుమారుడు కార్తీక్ సహకారంతో 305 కోట్ల రూపాయలను సమకూర్చుకున్నారన్నది ఆరోపణ. 
 
అడ్వాంటేజ్ ఇండియాతో పాటు కార్తీ చిదంబరానికి విదేశాల్లో ఉన్న అడ్వాంటేజ్ సింగపూర్ నుంచి ఈ విదేశీ నిధులు ఐఎన్ ఎక్స్ మీడియాకు బదలాయించారు. ఇందుకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం ఆమోదం లభించడానికి ఆర్థికమంత్రిగా చిదంబరం తన పలుకుబడి ఉపయోగించారన్నది ఆరోపణ.
 
ఈ పెట్టుబడుల వ్యవహారంలో చిదంబరం ప్రత్యక్షంగా పాలుపంచుకున్నారన్నది అభియోగం. ఇంద్రాణి ముఖర్జీ దంపతులతో ఆయన పలుమార్లు భేటీ అయ్యారనీ, ఈ విషయాన్ని ఇంద్రాణి స్వయంగా వివరించినట్లు సీబీఐ నివేదికలో వెల్లడించింది. ఐఎన్ఎక్స్‌లో ఎంత పెట్టుబడులు పెట్టారోనన్న విషయాన్ని సిబిఐకి ఆమె తెలియజేసింది. ఈ స్టేట్మెంట్ ఆధారంగా సిబిఐ చిదంబరాన్ని అరెస్టు చేసింది. 
 
కొడుకు కార్తీక్ ఒత్తిడితో చిదంబరం ఇలా చేసినట్లు సిబిఐ విచారణలో వెల్లడయినట్లు తెలుస్తోంది. ఇబ్బందులు వస్తాయని తెలిసినా చిదంబరం విదేశీ పెట్టుబడులు మళ్ళించే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదన్నది వాదన. కాగా చిదంబరాన్ని 5 రోజుల పాటు తమకు అప్పగించాలని సీబీఐ కోరింది. ఐతే కోర్టు దీనిని రిజర్వులో వుంచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments