Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిదంబరంకు షాక్.. విచారణాధికారిపై బదిలీవేటు.. ఈడీ చర్యలు

చిదంబరంకు షాక్.. విచారణాధికారిపై బదిలీవేటు.. ఈడీ చర్యలు
, గురువారం, 22 ఆగస్టు 2019 (14:00 IST)
ఐఎన్ఎక్స్ మీడియా స్కామ్‌లో అరెస్టు అయిన కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి పి. చిదంబరంకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ తేరుకోలేని షాకిచ్చింది. ఈ కేసును ఆది నుంచి విచారిస్తూ వచ్చిన అహుజాపై బదిలీ వేటు వేసి, ఈ కేసును విచారించేందుకు కొత్త అధికారిని నియమించింది. దీంతో ఈ కేసు విచారణ మొదటి నుంచి సాగనుంది.
 
అదేసమయంలో ఈ స్కామ్‌లో చిదంబరం వద్ద విచారించేందుకు వీలుగా ప్రశ్నావళిని రూపొందించింది. చిదంబరం వద్ద విచారించేందుకు సీబీఐ అధికారులు  100 ప్రశ్నలను సిద్ధం చేసినట్టు సమాచారం.
 
మరోవైపు, చిదంబరం అరెస్టు వ్యవహారం రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సీబీఐ, ఈడీలను స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. చిదంబరంకు అండగా ఉంటామని... చివరివరకు పోరాడుతామని తెలిపింది.
 
కాగా, ఈ కేసులో చిదంబరంను బుధవారం రాత్రి సీబీఐ అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో బుధవారం రాత్రంతా చిదంబరంను ఉంచారు. గురువారం ఉదయం సీబీఐ ప్రత్యేక కోర్టులో చిదంబరంను హాజరుపరిచి, విచారణ నిమిత్తం కస్టడీకి కోరనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాక్లెట్ ఆశ చూపి... ఆరేళ్ల చిన్నారిపై అరవైయేళ్ళ వృద్ధుడు అత్యాచారం