Webdunia - Bharat's app for daily news and videos

Install App

సత్యసాయి జిల్లాలో చెప్పుతో కొట్టుకున్న గ్రామ వాలంటీర్, ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (19:06 IST)
సత్యసాయి జిల్లాలో కదిరి మండలంలోని రామదాస్ నాయక్ తండాలో గ్రామ వాలంటీరుగా పనిచేస్తున్న నగేష్ నాయక్ అనే వ్యక్తి తన చెప్పుతో తనే కొట్టుకున్నాడు. పంటల బీమా సొమ్మును మొత్తం నువ్వే తినేసావా అని రైతులు నిలదీయడంతో ఆ పని చేసాడు నగేష్.

 
వివరాల్లోకి వెళితే... ఇ-క్రాప్ బుకింగ్ చేసిన రైతులకు ఇటీవలే పంటల బీమా సొమ్మును జమ చేసారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఐతే తన పరిధిలోని 50 మంది రైతుల ఖాతాల్లో సొమ్ము పడకపోయేసరికి అంతా కలిసికట్టుగా నగేష్ వద్దకు వచ్చారు.


తమకు జమ పడాల్సిన సొమ్మును స్వాహా చేసావా అంటూ నగేష్ ను నిలదీయడంతో అతడు ఆగ్రహం చెందాడు. వెంటనే వాళ్లందర్నీ వెంటబెట్టుకుని గ్రామ సచివాలయానికి వచ్చాడు. అక్కడ సచివాలయ ఉద్యోగులను పంటల బీమా సొమ్ము గురించి నిలదీశాడు. అక్కడే వున్న వ్యవసాయ అధికారి సైతం నగేష్ అడిగిన దానికి సరైన సమాధానం చెప్పలేకపోయాడు.

 
దీనితో నగేష్ తన చెప్పును తీసుకుని కొట్టుకుంటూ.. ఈ ఉద్యోగం వద్దూ ఏమీ వద్దు. వీరికి డబ్బులు పడ్డాక తన గ్రామ వాలంటీర్ పదవికి రాజీనామా చేస్తానంటూ వ్యాఖ్యానించాడు. రైతులందరూ బీమా సొమ్మును తానే తినేసినట్లు మాట్లాడుతున్నారనీ, ఇంతకంటే ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోవడం మంచిదని అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments