సత్యసాయి జిల్లాలో చెప్పుతో కొట్టుకున్న గ్రామ వాలంటీర్, ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (19:06 IST)
సత్యసాయి జిల్లాలో కదిరి మండలంలోని రామదాస్ నాయక్ తండాలో గ్రామ వాలంటీరుగా పనిచేస్తున్న నగేష్ నాయక్ అనే వ్యక్తి తన చెప్పుతో తనే కొట్టుకున్నాడు. పంటల బీమా సొమ్మును మొత్తం నువ్వే తినేసావా అని రైతులు నిలదీయడంతో ఆ పని చేసాడు నగేష్.

 
వివరాల్లోకి వెళితే... ఇ-క్రాప్ బుకింగ్ చేసిన రైతులకు ఇటీవలే పంటల బీమా సొమ్మును జమ చేసారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఐతే తన పరిధిలోని 50 మంది రైతుల ఖాతాల్లో సొమ్ము పడకపోయేసరికి అంతా కలిసికట్టుగా నగేష్ వద్దకు వచ్చారు.


తమకు జమ పడాల్సిన సొమ్మును స్వాహా చేసావా అంటూ నగేష్ ను నిలదీయడంతో అతడు ఆగ్రహం చెందాడు. వెంటనే వాళ్లందర్నీ వెంటబెట్టుకుని గ్రామ సచివాలయానికి వచ్చాడు. అక్కడ సచివాలయ ఉద్యోగులను పంటల బీమా సొమ్ము గురించి నిలదీశాడు. అక్కడే వున్న వ్యవసాయ అధికారి సైతం నగేష్ అడిగిన దానికి సరైన సమాధానం చెప్పలేకపోయాడు.

 
దీనితో నగేష్ తన చెప్పును తీసుకుని కొట్టుకుంటూ.. ఈ ఉద్యోగం వద్దూ ఏమీ వద్దు. వీరికి డబ్బులు పడ్డాక తన గ్రామ వాలంటీర్ పదవికి రాజీనామా చేస్తానంటూ వ్యాఖ్యానించాడు. రైతులందరూ బీమా సొమ్మును తానే తినేసినట్లు మాట్లాడుతున్నారనీ, ఇంతకంటే ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోవడం మంచిదని అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments