Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కూతురితో వివాహేతర సంబంధం.. చెప్పుతో కొట్టిన మహిళ

కూతురితో వివాహేతర సంబంధం.. చెప్పుతో కొట్టిన మహిళ
, బుధవారం, 13 అక్టోబరు 2021 (11:12 IST)
నిజామాబాద్‌లో పట్టణంలోని కార్పొరేటర్ భర్త ఇంటికి వెళ్లి ఓ మహిళ చెప్పుతో కొట్టింది. తమ కూతురితో వివాహేతర సంబంధం పెట్టుకుని వాడుకుంటున్నాడంటూ ఆరోపణలు చేస్తూ ఆ మహిళ.. చెప్పుతో కొట్టింది. అంతేకాదు తన కూతురిని మోసం చేశాడంటూ నిజామాబాద్ వినాయక నగర్‌లోని కార్పొరేటర్ భర్త ఇంటి ముందు బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది.
 
గతంలోనూ మందలించిన ఆ కార్పొరేటర్ భర్త తీరు.. మారకపోవడం.. ఏకంగా ఇంటి ముందే ఆందోళనకు దిగింది బాధిత కుటుంబం. రాత్రి తన కూతురిని ఎత్తుకెళ్లిన కార్పొరేటర్ భర్త ఆకుల శీనును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామంటూ బాధితురాలు తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ అమ్మాయి తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇందులో భాగంగానే కార్పొరేటర్ భర్త ఆకుల శీను ఇంటి ముందు ఆందోళనకి దిగారు అమ్మాయి తల్లిదండ్రులు. ఈ నేపథ్యంలోనే ఆకుల శీనుపై దాడి చేశారు అమ్మాయి తల్లిదండ్రులు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేపాల్‌లో బస్సు ప్రమాదం.. 28 మంది మృతి