Webdunia - Bharat's app for daily news and videos

Install App

రన్నింగ్‌లో పేలిన కారు టైరు... ట్రక్కును ఢీకొని ఐదుగురి దుర్మరణం

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (17:25 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. ఓ కారు టైరు పేలిపోవడంతో అది అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వీరంతా ఓ దర్గాలో ప్రార్థనలు చేసేందుకు బయలుదేరి మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రాంనగర్‌కు చెందిన ఓ కుటుంబం బరేలిలోని దర్గాలో ప్రార్థనలు చేసుకునేందుకు కారులో బయలుదేరారు. మంగళవారం ఉదయం కారు అహ్లాద్‌పూర్ చౌకి ప్రాంతానికి రాగానే కారు టైరు పేలిపోయింది. దీంతో కారు నియంత్రణ కోల్పోయింది. ఈ ప్రమాదంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది.
 
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల వయసు 30 నుంచి 40 యేళ్ల మధ్యలో ఉంటాయని పోలీసులు తెలిపారు. మృతులను మొహ్మద్ తాహిర్, ఇమ్రాన్ ఖాన్, మొహ్మద్ ఫరీద్, మొహ్మద్ సాగిర్‌గా గుర్తించారు. మరో మృతుడి వివరాలు తెలియరాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం - నిద్రమాత్రలు మింగి(Video)

ఆమని నటించిన నారి సినిమా కి 1+1 టికెట్ ఆఫర్

Tamannaah break up:తమన్నా భాటియా, విజయ్ వర్మల డేటింగ్ కు పాకప్ ?

Varalakshmi: కొంత ఇస్తే అది మళ్ళీ ఫుల్ సర్కిల్ లా వెనక్కి వస్తుంది: వరలక్ష్మీ, నికోలయ్‌ సచ్‌దేవ్‌

Tuk Tuk: సూపర్‌ నేచురల్‌, మ్యాజికల్‌ పవర్‌ ఎలిమెంట్స్‌ సినిమా టుక్‌ టుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments