Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ మనిషి కాదు.. కఠిన శిల... : ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనిషి కాదనీ, కఠిన శిలలాంటి వ్యక్తి అని టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహించారు. ఇదే ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చని కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోడీపై ఆ

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (10:51 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనిషి కాదనీ, కఠిన శిలలాంటి వ్యక్తి అని టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహించారు. ఇదే ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చని కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోడీపై ఆయన విమర్శలు గుప్పించారు. 
 
ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, 'చరిత్రను పక్కదోవ పట్టించే పనులు చేయొద్దు. మేము చిత్తశుద్ధితో పోరాడుతున్నాం. అవసరమైతే రాజీనామాలు చేస్తాం. కానీ, రాజీనామాలు చేయడం ద్వారా ప్రత్యేక హోదా రాదు. ఐదుగురు రాజీనామాలు చేసినా, ఏడుగురు రాజీనామాలు చేసినా ఏం ఉపయోగం లేదన్నారు. 
 
పైగా, ప్రధాని నరేంద్ర మోడీ అనేటటువంటివాడు కఠిన శిల, స్పందించే హృదయం లేదు. ప్రేమాభిమానాలు అంటే అతనికి తెలియవు. ఆ పద్ధతిలో అతను పెరగలేదు. ప్రేమతో పనిచేయడం నేర్చుకో! అనాథాశ్రమానికి వెళ్లి ఇద్దరు పిల్లలను తెచ్చి పెంచుకుంటే, ఆ ప్రేమ మాధుర్యమేంటో తెలుస్తుంది! నీకేమి (మోడీ) తెలుస్తుంది! అమ్మను ఒకచోట మూలన పారేశావు, ఇంకొక ఆమెను ఇంకో చోట పారేశావు.. టింగ్ రంగా అంటూ నువ్వొక్కడివే ఉన్నావు! ప్రేమను పంచు.. ప్రేమను స్వీకరించు!' అంటూ మోడీకి జేసీ హితవు పలికారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments