Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు పార్టీలు మారి వచ్చిన వారికి మంత్రిపదవులు.. గంటాపై అయ్యన్న ఫైర్

మూడు పార్టీలు మారివచ్చిన వారికి మంత్రిపదవులు ఇచ్చారంటూ రాష్ట్ర మంత్రి సీహెచ్. అయ్యన్నపాత్రుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన వైజాగ్‌లో మాట్లాడుతూ, మూడు పార్టీలు మారి వచ్చిన వ్యక్తికి తెలుగుదేశం పార్ట

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (10:06 IST)
మూడు పార్టీలు మారివచ్చిన వారికి మంత్రిపదవులు ఇచ్చారంటూ రాష్ట్ర మంత్రి సీహెచ్. అయ్యన్నపాత్రుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన వైజాగ్‌లో మాట్లాడుతూ, మూడు పార్టీలు మారి వచ్చిన వ్యక్తికి తెలుగుదేశం పార్టీ మంత్రి పదవి ఇచ్చిన విషయం మరచిపోయారా? అని ప్రశ్నించారు. తొలుత టీడీపీలో చేరి, తర్వాత రాజకీయ స్వలాభాల కోసం ప్రజారాజ్యం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన, మళ్లీ పదవుల కోసం తెలుగుదేశంలో చేరారని వ్యాఖ్యానించారు.
 
ఇకపోతే, మంత్రి గంటా తన గతాన్ని మరచిపోయి మాట్లాడటం సరికాదన్నారు. నిబంధనల ప్రకారం డీఎల్‌డీఏకు కొత్త కమిటీని నియమిస్తే తనకు అభ్యంతరం లేదని, అయితే జిల్లాకు చెందిన ఇన్‌ఛార్జి మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలకు తెలియకుండా ఆయన(గంటా)కు నచ్చిన వారితో కమిటీని ఏర్పాటు చేయించడం సరికాదని అయ్యన్నపాత్రుడు అన్నారు. 
 
ఆ పదవిని రాజకీయ వివాదాల కారణంగా ఇప్పటికీ ప్రభుత్వం భర్తీ చేయలేకపోయిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెడలు వంచాలంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగోడి సత్తా చాటడం ఒక్కటే మార్గమని మంత్రి అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments