Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాప్‌లెస్‌ ఫోటో పోస్ట్ చేసిన హీరో వైఫ్... గర్వంగా ఫీలైన హీరో

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (19:34 IST)
సెలబ్రిటీలు, సామాన్యులు అంటూ తేడా లేకుండా దాడి చేస్తున్న మహమ్మారి క్యాన్సర్. ఇప్పటికే చాలామంది ప్రముఖులు దీని బారినపడి కష్టమైన ట్రీట్మెంట్ దశను ధైర్యంగా దాటుకుని బయటపడ్డారు. ఆ తర్వాత కొంతమంది సంతోషంగా జీవిస్తూ ఉంటే మరికొందరు దీని గురించి అవగాహన కల్పించడానికి పోరాడుతున్నారు. 
 
ఇటీవలి కాలంలో బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్యకు క్యాన్సర్ స్టేజ్ 0 సోకినట్లు గత ఏడాది నవంబర్‌లో నిర్ధారణ అయ్యింది. ఆమె పేరు తాహీరా కశ్యప్, అప్పటి నుండి బ్రెస్ట్ క్యాన్సర్‌కు ట్రీట్మెంట్ పొందుతోంది. ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఆవిడ చేసిన ట్వీట్ హృదయాలను హత్తుకునే విధంగా ఉంది. 
 
"ఈరోజు నాది! అందరికీ ప్రపంచ క్యాన్సర్ డే శుభాకాంక్షలు, ఈ రోజును మనమంతా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. నా ఒంటిపై ఉన్న ఈ మచ్చలను గౌరవ చిహ్నాలుగా భావిస్తున్నాను. ఇది చాలా కష్టంగా ఉన్నప్పటికీ ఈ చిత్రం నా నిర్ణయం, ఎందుకంటే ఈ సందర్భంగా నేను నా వ్యాధిని కాకుండా దానిపై నా పోరాట స్ఫూర్తిని తెలియజెప్పాలనుకుంటున్నాను" అంటూ టాప్‌లెస్‌గా గుండుతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. 
 
దీనిపై స్పందిస్తూ ఖురానా "ఈ మాటలు నీకోసమే తాహిరా.. ఈ మచ్చలు చాలా అందంగా ఉన్నాయి.. ఇలాగే నువ్వు కోట్ల మందిని తమ యుద్ధాలను ధైర్యంగా కొనసాగించడానికి స్ఫూర్తిగా నిలవాలి" అంటూ ట్వీట్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments