Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాప్‌లెస్‌ ఫోటో పోస్ట్ చేసిన హీరో వైఫ్... గర్వంగా ఫీలైన హీరో

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (19:34 IST)
సెలబ్రిటీలు, సామాన్యులు అంటూ తేడా లేకుండా దాడి చేస్తున్న మహమ్మారి క్యాన్సర్. ఇప్పటికే చాలామంది ప్రముఖులు దీని బారినపడి కష్టమైన ట్రీట్మెంట్ దశను ధైర్యంగా దాటుకుని బయటపడ్డారు. ఆ తర్వాత కొంతమంది సంతోషంగా జీవిస్తూ ఉంటే మరికొందరు దీని గురించి అవగాహన కల్పించడానికి పోరాడుతున్నారు. 
 
ఇటీవలి కాలంలో బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్యకు క్యాన్సర్ స్టేజ్ 0 సోకినట్లు గత ఏడాది నవంబర్‌లో నిర్ధారణ అయ్యింది. ఆమె పేరు తాహీరా కశ్యప్, అప్పటి నుండి బ్రెస్ట్ క్యాన్సర్‌కు ట్రీట్మెంట్ పొందుతోంది. ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఆవిడ చేసిన ట్వీట్ హృదయాలను హత్తుకునే విధంగా ఉంది. 
 
"ఈరోజు నాది! అందరికీ ప్రపంచ క్యాన్సర్ డే శుభాకాంక్షలు, ఈ రోజును మనమంతా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. నా ఒంటిపై ఉన్న ఈ మచ్చలను గౌరవ చిహ్నాలుగా భావిస్తున్నాను. ఇది చాలా కష్టంగా ఉన్నప్పటికీ ఈ చిత్రం నా నిర్ణయం, ఎందుకంటే ఈ సందర్భంగా నేను నా వ్యాధిని కాకుండా దానిపై నా పోరాట స్ఫూర్తిని తెలియజెప్పాలనుకుంటున్నాను" అంటూ టాప్‌లెస్‌గా గుండుతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. 
 
దీనిపై స్పందిస్తూ ఖురానా "ఈ మాటలు నీకోసమే తాహిరా.. ఈ మచ్చలు చాలా అందంగా ఉన్నాయి.. ఇలాగే నువ్వు కోట్ల మందిని తమ యుద్ధాలను ధైర్యంగా కొనసాగించడానికి స్ఫూర్తిగా నిలవాలి" అంటూ ట్వీట్ చేసారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments