డియర్ బెనర్జీ... దురభిమానులకు ద్వేషంతో కళ్లుమూసుకుపోయాయి

Webdunia
సోమవారం, 21 అక్టోబరు 2019 (16:18 IST)
పేదరిక నిర్మూలనకు విశిష్ట పరిశోధనలు జరిపినందుకుగాను ఈ యేడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం వరించిన ఇండో-అమెరికా శాస్త్రవేత్త అభిజిత్ బెనర్జీకి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అండగా నిలబడ్డారు. అభిజిత్‌పై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ ఖండించారు. ముఖ్యంగా, అభిజిత్‌ ఫ్రొఫెషనలిజంపై గోయల్‌ ప్రశ్నలు లేవనెత్తడాన్ని రాహల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
ఇదే అంశంపై రాహుల్ ఓ ట్వీట్ చేశారు. 'డియర్‌ బెనర్జీ.. ఈ దురభిమానులకు ద్వేషంతో కళ్లుమూసుకుపోయాయి. వారికి ఫ్రొఫెషనల్‌ అంటే ఏంటో తెలీదు. మీరు దాని గురించి వారికి వివరించలేరు. దశాబ్దాల పాటు ప్రయత్నించినా అది వృథా ప్రయాసే అవుతుంది. మీ కృషి పట్ల లక్షలాది మంది భారతీయులు గర్విస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోండి' అంటూ అందులో పేర్కొన్నారు.
 
అభిజిత్‌ వామపక్షవాది అని, ఆయన ప్రతిపాదించిన 'న్యాయ్‌' పథకం ఎన్నికల్లో తిరస్కరణకు గురైందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను అభిజిత్‌తో పాటు.. రాహుల్ గాంధీ కూడా తోసిపుచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments