కొందరి పిల్ల చేష్టల వల్ల పేదలు నష్టపోతున్నారు : పియూష్ గోయల్

Webdunia
సోమవారం, 21 అక్టోబరు 2019 (16:11 IST)
కొంతమంది చేష్టల వల్ల పేదలకు అభివృద్ధికి దూరమవుతున్నారని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అభిప్రాయపడ్డారు. గోవాలో జరిగిన వైబ్రంట్‌ గోవా బిజినెస్‌ కాన్‌క్లేవ్‌ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్న వారికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి వారి వల్ల దేశంలో పేదవారికి న్యాయం జరగడం లేదని వాపోయారు. 
 
గోవాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడానికి కొందరు (ఎన్జీవోలు) కోర్టులను ఆశ్రయించారు. ఫలితంగా అభివృద్ధి కుంటుపడింది. వీరి చర్యల వల్ల పేదవారికి న్యాయం జరుగడం లేదు. అందుకే ఇలాంటివారికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం రావాలి అని వ్యాఖ్యానించారు. 
 
గోవాలో మంచి రోడ్లు నిర్మించడాన్ని, హోటళ్లు ఏర్పాటు చేయడాన్ని, విమానాశ్రయాలను నెలకొల్పడాన్ని, పోర్టులను విస్తరించడాన్ని కొందరు అడ్డుకుంటున్నారు. దీంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గోవాలో అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? గోవా అభివృద్ధి చెందితే అక్కడ నివసించే ప్రజలు కూడా మెరుగైన జీవనాన్ని సాగిస్తారు. కానీ కొందరి చేష్టల వల్ల పేదవారు మెరుగైన జీవనాన్ని పొందలేకపోతున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments