Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ కాంగ్రెస్ వితంతువు అకౌంట్లోకి అంత మొత్తం చేరిందో?: నరేంద్ర మోదీ

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (10:29 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతవారంలో రాజస్థాన్‌లో పర్యటనలో భాగంగా.. మోదీ ఓ ప్రచార సభలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేగాకుండా మోదీ వ్యాఖ్యలు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీని ఉద్దేశించినవని నెట్టించ రచ్చ రచ్చ జరుగుతోంది.


ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తలు, నెటిజన్లు మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ప్రధానిపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలను మోదీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
ఇంతకీ మోదీ చేసిన వ్యాఖ్యల సంగతికి వస్తే.. కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలకు పాల్పడిందని.. వితంతు ఫించన్ పథకం అందులో ఒకటని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా ఏ కాంగ్రెస్ వితంతువు అకౌంట్లోకి ఈ మొత్తం చేరిందోనని కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన సీడబ్ల్యూసీ సభ్యుడు సిద్ధరామయ్య.. ప్రధాని దిగజారుడుతనానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని ఫైర్ అయ్యారు. 
 
ఇలాంటి మాటలతో ప్రధాని తన పదవికే కళంకం తెచ్చారని.. మహిళలందరీ ఆయన అవమానపరిచేలా వ్యాఖ్యానించారని నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ నుంచి నేర్చుకోవాల్సింది చాలా వుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments