Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆమరణ దీక్ష చేస్తే గత్యంతరం లేకుండా తెలంగాణ ఇచ్చారు..

ఆమరణ దీక్ష చేస్తే గత్యంతరం లేకుండా తెలంగాణ ఇచ్చారు..
, ఆదివారం, 25 నవంబరు 2018 (14:50 IST)
తెలంగాణలో మధ్యంతర ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ కూడా ఆపలేరని ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఎలా వుందనే అంశంపై చేసిన సర్వేలో.. టీఆర్ఎస్ విజయం ఖాయమని తేలిపోయిందని కేసీఆర్ చెప్పారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారే వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 
 
తాజా సర్వే ప్రకారం తెలంగాణలో 103 నుంచి 106 సీట్లను కైవసం చేసుకుంటుందని కేసీఆర్ తెలిపారు. తాండూరులో నిర్వహించిన ఎన్నికల సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గెలిస్తేనే నిజమైన ప్రజాస్వామ్యమని తెలిపారు. అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుందని చెప్పారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పర్యటన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ ఘాటుగా స్పందించారు.
 
2004లో తాము పార్టీతో పొత్తు పెట్టుకుని గెలిచిన తర్వాత తెలంగాణ ఇస్తే బాగుండేదన్నారు. కానీ 14 ఏళ్లు తెలంగాణ ఇవ్వకుండా సాచివేత ధోరణిని అవలంబించిందన్నారు. తాను తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేస్తే గత్యంతరం లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని కేసీఆర్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అర్జున్ రెడ్డి హీరోయిన్ ఇలా తయారయ్యిందేంటి?