Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీలక దశకు చేరుకున్న చంద్రయాన్....

Webdunia
సోమవారం, 2 సెప్టెంబరు 2019 (14:47 IST)
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 ఆదివారం కీలక దశకు చేరుకుంది. సోమవారం మధ్యాహ్నం 12:45-1:45 మధ్య ఆర్బిటర్ నుంచి ‘విక్రమ్’ ల్యాండర్ విడిపోయింది. జులై 22వ తేదీన నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2 గత నెల 20న జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది. ఆ తర్వాత నాలుగుసార్లు దాని కక్ష్యను తగ్గించిన ఇస్రో శాస్త్రవేత్తలు ఆదివారం ఐదోసారి మరోమారు దానిని కక్ష్య దూరాన్ని తగ్గించారు.
 
చంద్రయాన్ -2 కక్ష్య ఇప్పుడు 119X127 కిలోమీటర్లుగా ఉంది. ఆదివారం చంద్రయాన్ నిర్దేశిత కక్ష్యలోకి చేరుకున్న వెంటనే ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోతుంది. ఈ ప్రక్రియ 50 మిల్లీ సెకన్లలోనే జరగనుండడం విశేషం. ఆ తర్వాత సోమవారం, మంగళవారం ల్యాండర్ కక్ష్యను మరోమారు తగ్గించి 35X97 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఈ నెల 7వ తేదీన ప్రయోగం చివరి దశకు చేరుకుంటుంది.
 
చంద్రయాన్-2లోని రాకెట్లను మండించడం ద్వారా దానిని కిందికి దించుతారు. 15 నిమిషాల అనంతరం విక్రమ్ జాబిల్లిపై దక్షిణ ధ్రువానికి సమీపంలో ల్యాండవుతుంది. ఇది జరిగిన 4 గంటల తర్వాత అందులోని రోవర్ బయటకు వచ్చి ప్రయోగాలు చేపట్టి ఆ వివరాలను ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలకు పంపుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments