Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రిపై కారప్పొడి దాడి... ఎక్కడ.. ఎవరు?

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (18:13 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కారప్పొడి దాడి జరిగింది. ఢిల్లీలో జరిగిన ఈ దాడిలో ఆయనకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. అయితే, సాక్షాత్తూ ఢిల్లీ సచివాలయంలోనే ఈ దాడి జరగడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. అదేసమయంలో కారప్పొడితో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 
 
మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ తన ఛాంబర్ నుంచి బయటకు వస్తున్నారు. ఆ సమయంలో కాపుకాచి అక్కడే ఉన్న అనిల్ కుమార్ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో సీఎం చాంబర్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నంలో తోపులాట కూడా జరిగింది. ఈ ఘర్షణలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కళ్లజోడు కూడా పగిలిపోయింది. 
 
కాగా, నిందితుడు అనిల్ కుమార్ భార్య సచివాలయంలోనే పని చేస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై నిందితుడు ఎందుకు దాడిచేశాడన్నది తెలియడంలేదు. కాగా, ఇది దారుణమైన భద్రతా వైఫల్యమని ఆప్ పార్టీ విమర్శించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments