Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంబూరులో మటన్ బిర్యానీ కాదు.. డాగ్ బిర్యానీ.. పరుగులు తీసిన జనం..

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (18:01 IST)
తమిళనాడు రాజధాని చెన్నై ఎగ్మూర్‌ స్టేషన్‌లో 1000 కిలోల కుక్క మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.. రైల్వే అధికారులు. ఈ మాంసాన్ని ఎప్పుడైతే పోలీసులు స్వాధీనం చేసుకున్నారో.. హోటళ్లలో వెళ్లి బిర్యానీ తినేవారికి భయం పట్టుకుంది. హోటళ్లలో మటన్‌కు బదులు కుక్క మాంసాన్ని వాడుతున్నారని తేలడంతో.. జనం బిర్యానీ అంటేనే జడుసుకుంటున్నారు.
 
ఈ నేపథ్యంలో బిర్యానీకీ బాగా పాపులర్ అయిన తమిళనాడులోని ఆంబూరులో మటన్‌తో పాటు కుక్క మాంసాన్ని కలిపి బిర్యానీ వండటమే కాకుండా అమ్మాలని చూసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంబూరులోని ఓ షాపులో చౌక ధరకే బిర్యానీ అమ్ముతున్నట్లు తెలియడంతో ప్రజలు ఆసక్తిగా వెళ్లి, బిర్యానీ లాగించారు. 
 
అయినా బిర్యానీ తింటుండగా అది మటనా అనే డౌట్ జనాలకు రావడంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ షాపు వద్దకు వెళ్లి విచారణ జరపడంతో.. అది మటన్ బిర్యానీ కాదని.. డాగ్ బిర్యానీ అని తేలింది. అంతే ఆ షాపుకు వచ్చిన జనం అబ్బే అంటూ చేతులు కూడా వాంతులు చేసుకుంటూ పరుగులు తీశారు. దీంతో షాపు నడిపిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

ప్రేమించడం లేదా అన్నది తన వ్యక్తిగతం : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

తర్వాతి కథనం
Show comments