Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ సహకారంతోనే చైర్మన్‌నయ్యా: తెదేపాకి జేసీ ప్రభాకర్ రెడ్డి సునామీ షాక్

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (18:52 IST)
రాష్ట్రంలో ఒకే ఒక్క మునిసిపల్ చైర్మన్ పదవి దక్కించుకున్నామంటూ తెలుగుదేశం పార్టీ ఎంతో గొప్పగా చెప్పుకుంటూ సంబురాలు చేసుకుంటోంది. ఆ సంబురాలు ఆగక ముందే చైర్మన్ పదవికి ఎంపికైన జేసీ ప్రభాకర్ రెడ్డి తెదేపా అధినేతలకు సునామీ షాకిచ్చారు. జేసీ దెబ్బతో పార్టీ నాయకులు షాక్ తిన్నారు.
 
అసలు ఏం జరిగిందయ్యా అంటే... మునిసిపల్ చైర్ పర్సన్ గా ఎంపికైన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... సీఎం జగన్ మోహన్ రెడ్డి నైతిక విలువలున్న వ్యక్తి. తండ్రి వైఎస్ఆర్ లాగానే జగన్ మోహన్ రెడ్డిలో కూడా చాలా విలువలున్నాయి. వాటిని నేను ఈరోజు స్వయంగా చూశాను.
 
సీఎం జగన్ సహకారం లేకపోతే నేనిప్పుడు మునిసిపల్ చైర్మన్ అయ్యుండేవాడిని కాదు. త్వరలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలుస్తాననీ, తాడిపత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే, ఎంపీలతో కలిసి పనిచేస్తానన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలతో ఇక ఆయన వైసిపిలో చేరడం ఖాయమని అంటున్నారు.
 
సోదరుడు ఎలాగూ అసలు విషయం చెప్పేశాడు కనుక జేసీ దివాకర్ రెడ్డి కూడా జగన్‌కు జై అనేస్తారని అంటున్నారు. మొత్తమ్మీద రాష్ట్రంలో ఏదో ఒక్క మునిసిపల్ స్థానం దక్కించుకున్నామన్న సంతోషం ఎంతోసేపు నిలవలేదు తెదేపాకి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jabardasth Comedian: వైల్డ్ కార్డ్ ఎంట్రీ- బిగ్‌బాస్ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments