Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ సహకారంతోనే చైర్మన్‌నయ్యా: తెదేపాకి జేసీ ప్రభాకర్ రెడ్డి సునామీ షాక్

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (18:52 IST)
రాష్ట్రంలో ఒకే ఒక్క మునిసిపల్ చైర్మన్ పదవి దక్కించుకున్నామంటూ తెలుగుదేశం పార్టీ ఎంతో గొప్పగా చెప్పుకుంటూ సంబురాలు చేసుకుంటోంది. ఆ సంబురాలు ఆగక ముందే చైర్మన్ పదవికి ఎంపికైన జేసీ ప్రభాకర్ రెడ్డి తెదేపా అధినేతలకు సునామీ షాకిచ్చారు. జేసీ దెబ్బతో పార్టీ నాయకులు షాక్ తిన్నారు.
 
అసలు ఏం జరిగిందయ్యా అంటే... మునిసిపల్ చైర్ పర్సన్ గా ఎంపికైన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... సీఎం జగన్ మోహన్ రెడ్డి నైతిక విలువలున్న వ్యక్తి. తండ్రి వైఎస్ఆర్ లాగానే జగన్ మోహన్ రెడ్డిలో కూడా చాలా విలువలున్నాయి. వాటిని నేను ఈరోజు స్వయంగా చూశాను.
 
సీఎం జగన్ సహకారం లేకపోతే నేనిప్పుడు మునిసిపల్ చైర్మన్ అయ్యుండేవాడిని కాదు. త్వరలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలుస్తాననీ, తాడిపత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే, ఎంపీలతో కలిసి పనిచేస్తానన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలతో ఇక ఆయన వైసిపిలో చేరడం ఖాయమని అంటున్నారు.
 
సోదరుడు ఎలాగూ అసలు విషయం చెప్పేశాడు కనుక జేసీ దివాకర్ రెడ్డి కూడా జగన్‌కు జై అనేస్తారని అంటున్నారు. మొత్తమ్మీద రాష్ట్రంలో ఏదో ఒక్క మునిసిపల్ స్థానం దక్కించుకున్నామన్న సంతోషం ఎంతోసేపు నిలవలేదు తెదేపాకి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments