Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగరంలో పేరెంట్స్, ఇంట్లో ఒంటరిగా బాలిక, ముగ్గురు టెన్త్ క్లాస్ విద్యార్థులు గ్యాంగ్ రేప్

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (18:26 IST)
తల్లిదండ్రులు బ్రతుకుదెరువు కోసం చెన్నై నగరానికి వచ్చారు. కుమార్తె సొంత ఊరులో బంధువుల ఇంట్లో వుండి 8వ తరగతి చదువుకుంటోంది. ఆమెపై కన్నేశాడు సమీపంలో వున్న ఓ విద్యార్థి. పదో తరగతి చదువుతున్న ఆ విద్యార్థి మాయ మాటలు చెప్పి ఆమెకి దగ్గరయ్యాడు. అత్యాచారం చేసాడు.
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లా తిరునావలూరుకు చెందిన 13 ఏళ్ల బాలిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటోంది. ఈ బాలికతో ఆమె ఇంటికి కాస్త సమీపంలో వుండే పదో తరగతి విద్యార్థి పరిచయం పెంచుకున్నాడు.
 
బంధువులు ఇంట్లో వున్న ఆమె ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూసాడు. ఆ అవకాశం రాగానే ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత తన ఇద్దరు స్నేహితులను పిలిచి వారితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
ఆ తర్వాత ఆ ఘటన తాలూకు వీడియోలు తీసి వాటిని చూపించి తమ కోర్కె తీర్చాలంటూ పలుమార్లు లైంగిక దాడి చేశారు. ఇటీవల ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తమ కుమార్తెలో ఏదో తేడా గమనించి గట్టిగా నిలదీసారు. దీనితో జరిగిన విషయం చెప్పింది. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అఘాయిత్యం చేసిన వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మూడో విద్యార్థి పరారీలో వున్నాడు. అతడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం