Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ హత్య కేసు: నేరస్తులను 'మహానది' సింగిల్ సెల్‌కు తరలించిన పోలీసులు, ఏమిటీ సింగిల్‌ సెల్‌?

Webdunia
సోమవారం, 2 డిశెంబరు 2019 (19:00 IST)
ప్రమాదకరంగా ఉండే రిమాండ్‌ ఖైదీలతో పాటు జైలు సిబ్బందితో గొడవపడే ఖైదీలను సింగిల్‌ సెల్స్‌కు మార్చడం చర్లపల్లి జైలులో తరచూ జరిగే పరిణామమే. తోటి ఖైదీల నుంచి హాని ఉన్న ఖైదీలను కూడా ఈ సింగిల్‌ సెల్స్‌కు మారుస్తుంటారు. పశువైద్యురాలిపై పైశాచికత్వం ప్రదర్శించిన నలుగురు నిందితులను ఈ కారణంతోనే సింగిల్‌ సెల్‌కు మార్చారు. 
 
చర్లపల్లి జైల్లో ఖైదీలను ఉంచేందుకు మూడు అంతస్తుల్లో మూడు బ్యారక్‌లు ఉంటాయి. ఒక్కో బ్యారక్‌లో నాలుగు నుంచి ఎనిమిది హాళ్లుంటాయి. ఒక్కో హాల్‌లో 16 నుంచి 30 మంది దాకా ఖైదీలుంటారు. జైలు వేళల్లో వారికి కేటాయించిన పనులు చేసుకొని వచ్చే ఖైదీలు ఈ హాళ్లలోనే నిద్ర పోతుంటారు. సింగిల్‌ సెల్స్‌ వీటికి భిన్నంగా ఉంటాయి. వీటిలో ముందువైపు తలుపునకు కటకటాలు, వెనక వైపు దాదాపు 13 అడుగుల ఎత్తులో ఒక వెంటిలేటర్‌ మాత్రమే ఉంటాయి. 
 
అందులోనే ఒక మూల కాలకృత్యాలు తీర్చుకునేందుకు వీలుగా గోడచాటుగా ఉండే బాత్‌రూం మాత్రమే ఉంటుంది. జైలులోని ఇతర విషయాలేవీ వీరికి తెలిసే అవకాశం ఉండదు. సమయానికి టిఫిన్‌, టీ, భోజనం మాత్రం అందిస్తారు. చీకటి కొట్టులాంటి సింగిల్‌ సెల్‌లోని ఖైదీలు ఎలాంటి అఘాయిత్యానికి, ఆత్మహత్యా యత్నానికి పాల్పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. 
 
స్పూను, గ్లాసు, ప్లేటు లాంటివే కాకుండా బాత్‌రూంలో కనీసం బకెట్‌ కూడా ఉండకుండా చూస్తారు. కారిడార్‌లో ఉండే విద్యుత్‌ దీపమే వారికి రాత్రి వేళ గుడ్డి వెలుగునిస్తుంది. ప్రస్తుతం నిందితులు ఉన్న మహానది బ్యారక్‌లోని సింగిల్‌ సెల్స్‌లోనే గతంలో మొద్దు శ్రీను హత్య కేసులో నిందితుడైన ఓంప్రకా‌ష్‌ను ఉంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments