Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలపై అఘాయిత్యాలు: డీజీపీకి లేఖ రాసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Webdunia
సోమవారం, 2 డిశెంబరు 2019 (18:51 IST)
రాష్ట్రంలోని విద్యార్థినులకు ఆత్మరక్షణ మెలకువలను నేర్పించేందుకు షీ టీమ్స్ ద్వారా ఏర్పాట్లు చేయాలనీ రాష్ట్ర విద్యా శాఖా మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి డీజీపీకి లేఖ రాశారు. విద్యార్థినులపై అఘాయిత్యాలు, దాడులు జరుగకుండా సరైన అవగాహనా కల్పించాలని డీజీపీకి సూచించారు.

పోలీస్ విభాగంతో సమన్వయం చేసుకోవాలని విద్యాశాఖా అధికారులను ఆదేశించారు. సమస్య వచ్చినపుడు ఎలా ఎదుర్కోవాలి, ఎవరిని ఆశ్రయించాలి అనే విషయంపై విద్యార్థినులను చైతన్యపరచాలని మంత్రి కోరారు. షీ-టీమ్స్‌పై  అవగాహన పెంపొందించాలని సూచించారు. 
 
ప్రస్తుతం అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ల పట్ల పూర్తి అవగాహన కల్పించాలని కోరారు. వేధింపులకు గురవుతున్న మహిళలు, కళాశాల విద్యార్థినులు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలనీ కోరారు. వాట్సాప్, కంట్రోల్ రూమ్, షీ-టీమ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో వస్తున్న ఫిర్యాదులపై పోలీసులు స్పందించి బాధితులకు అండగా నిలవాలని కోరారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments