Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధారావిలో శరవేగంగా కరోనా ... కంటిమీద కునుకు కరువు

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (17:44 IST)
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావి. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఉంది. ఈ మురికివాడలో నివసించే ప్రజలకు కరోనా సోకింది. ఇది అధికారులకు కంటిమీద కనుకులేకుండా చేస్తోంది. ఎందుకంటే, ఇక్కడ ఒక్కసారి కరోనా వైరస్ విజృంభిస్తే ఇక అదుపు చేయడం అసాధ్యమన్నది అధికారుల అంచనా. అందుకే ముంబై నగర పాలక సంస్థ అధికారులు భయంతో వణికిపోతున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఏకంగా3 వేల కోవిడ్ కేర్ బెడ్లను కూడా సిద్ధం చేశారు. నిజానికి ఈ బెడ్లు ఏ మూలకూ సరిపోవు. కానీ, కేసుల అంచనాను బట్టి ఈ బెడ్ల సంఖ్యను పెంచాలని భావిస్తున్నారు. 
 
మరోవైపు, మహారాష్ట్రను కరోనా పట్టిపీడిస్తోంది. ఈ ఒక్క రాష్ట్రంలోనే 6500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంటే, రెండో స్థానంలో రాజస్థాన్, మూడో స్థానంలో ఢిల్లీ ఉంది. అలాగే కరోనా మరణాల్లోనూ మహారాష్ట్రే ముందువరుసలో ఉంది. 
 
దీంతో దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబై కరోనా దెబ్బకు చిగురుటాకులా వణికిపోతోంది. ప్రస్తుత పరిస్థితి మరో నెల రోజుల పాటు కొనసాగిన పక్షంలో ఈ ఒక్క రాష్ట్రంలోనే ఏకంగా 70 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. కేంద్రం కూడా ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగుతోంది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments