Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధారావిలో శరవేగంగా కరోనా ... కంటిమీద కునుకు కరువు

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (17:44 IST)
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావి. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఉంది. ఈ మురికివాడలో నివసించే ప్రజలకు కరోనా సోకింది. ఇది అధికారులకు కంటిమీద కనుకులేకుండా చేస్తోంది. ఎందుకంటే, ఇక్కడ ఒక్కసారి కరోనా వైరస్ విజృంభిస్తే ఇక అదుపు చేయడం అసాధ్యమన్నది అధికారుల అంచనా. అందుకే ముంబై నగర పాలక సంస్థ అధికారులు భయంతో వణికిపోతున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఏకంగా3 వేల కోవిడ్ కేర్ బెడ్లను కూడా సిద్ధం చేశారు. నిజానికి ఈ బెడ్లు ఏ మూలకూ సరిపోవు. కానీ, కేసుల అంచనాను బట్టి ఈ బెడ్ల సంఖ్యను పెంచాలని భావిస్తున్నారు. 
 
మరోవైపు, మహారాష్ట్రను కరోనా పట్టిపీడిస్తోంది. ఈ ఒక్క రాష్ట్రంలోనే 6500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంటే, రెండో స్థానంలో రాజస్థాన్, మూడో స్థానంలో ఢిల్లీ ఉంది. అలాగే కరోనా మరణాల్లోనూ మహారాష్ట్రే ముందువరుసలో ఉంది. 
 
దీంతో దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబై కరోనా దెబ్బకు చిగురుటాకులా వణికిపోతోంది. ప్రస్తుత పరిస్థితి మరో నెల రోజుల పాటు కొనసాగిన పక్షంలో ఈ ఒక్క రాష్ట్రంలోనే ఏకంగా 70 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. కేంద్రం కూడా ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

మరో సినిమాకు రెడీ అయిన నందమూరి కళ్యాణ్ రామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments