Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోలుకోని కర్నూలు.. కొత్తగా 27 కరోనా కేసులు.. ఏపీలో 1000కి చేరువగా...

కోలుకోని కర్నూలు.. కొత్తగా 27 కరోనా కేసులు.. ఏపీలో 1000కి చేరువగా...
, శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (13:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. గత 24 గంటల్లో కొత్తగా మరో 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క కర్నూలు జిల్లాలోనే ఏకంగా 27 కేసులు నమోదు కాగా, గుంటూరులో మరో 11 కేసులు నమోదయ్యాయి. అలాగే, అనంతపురంలో నాలుగు, ఈస్ట్ గోదావరిలో రెండు, ప్రకాశంలో 3, కృష్ణా జిల్లాలో 14 చొప్పున నమోదయ్యాయి. ఈ కొత్త కేసులతో కలుపుకుంటే ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 955కు చేరాయి. 
 
అయితే, ఏపీలోని 13 జిల్లాల్లో రెండు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా వైరస్‌ కేసులు భారీగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌‌లో కరోనాతో 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 29గా ఉంది.
 
ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 781గా ఉంది. 145 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 6,306 నమూనాలను పరీక్షించినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే, 
 
అనంతపురం 46, చిత్తూరు 73, ఈస్ట్ గోదావరి 34, గుంటూరు 206, కడప 51, కృష్ణ 102, కర్నూలు 261, నెల్లూరు 68, ప్రకాశం 53, విశాఖపట్టణం 22, వెస్ట్ గోదావరి 39 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డోనల్డ్ ట్రంప్: అమెరికాలోకి వలసలను నిషేధించడం వల్ల భారత్‌పై పడే ప్రభావం ఎంత?