లాక్‌డౌన్‌లో కదిలిన తొలి రైలు.. లింగంపల్లి నుంచి హతియాకు బయలుదేరింది..

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (12:38 IST)
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బకు సంపూర్ణ లాక్‌డౌన్ అమల్లోవుంది. ఇది మే 3వ తేదీతో ముగియనుంది. ఈ లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజా రవాణా బంద్ అయింది. దీంతో విమాన, రైలు సర్వీసులు కూడా నిలిపివేశారు. 
 
అయితే, ఈ లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి తొలి రైలు హైదరాబాద్‌లోని లింగంపల్లి నుంచి జార్ఖండ్ రాష్ట్రంలోని హతియాకు బయలుదేరింది. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో చిక్కుకుకున్న వివిధ ప్రాంతాలకు చెందిన వలస కూలీలు వెళ్లారు. సుమారుగా 1,200 మంది వలస కార్మికులు, తెలంగాణలో చిక్కుకుపోయిన జార్ఖండ్ కూలీలు ఈ రైలులో వెళ్లారు. 
 
ఈ రైలుకు మొత్తం 24 బోగీలను ఏర్పాటు చేశారు. అయితే, ఒక్కో బోగీలో 72 బెర్తులు ఉన్నప్పటికీ సామాజిక దూరం పాటించేలా కేవలం 54 మందిని మాత్రమే ఒక్కో బోగీలోకి అనుమతించారు. 
 
నిజానికి ఈ వలస కూలీలను రోడ్డు మార్గంలో తరలించేందుకు మాత్రమే కేంద్రం అనుమతి ఇచ్చింది. కానీ, కేంద్ర ప్రతిపాదనను అనేక రాష్ట్రాలు వ్యతిరేకించాయి. రైళ్ల ద్వారా పంపేందుకు సహకరించాలని కేంద్రాన్ని కోరాయి. దీంతో కేంద్రం నిబంధనలను సడలించింది. ఆ వెంటనే దక్షిణ మధ్య రైల్వే ఈ రైలును నడిపేలా చర్యలు తీసుకుంది. 
 
మరోవైపు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ సైతం హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరిందని ట్వీట్ చేశారు. జార్ఖండ్ వచ్చిన వారిని స్వస్థలాలకు తరలిస్తామని, అంతకన్నా ముందే ఆరోగ్య పరీక్షలు జరుపుతామని, పైగా, జార్ఖండ్‌కు వచ్చేవారంతా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు.
 
అలాగే, జార్ఖండ్ కూలీలు దాదాపు 500 మంది హైదరాబాద్ ఐఐటీలో తలదాచుకుని ఉండగా, వారిని 57 బస్సుల్లో శుక్రవారం తెల్లవారుజామున లింగంపల్లి స్టేషన్‌కు అధికారులు తరలించారు. ఆపై వారిని రైలులోకి అనుమతించారు. ఇదిలావుండగా, పంజాబ్, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్రలు కూడా తమ రాష్ట్రాలకు చెంది, ఇతర ప్రాంతాల్లో చిక్కుబడిన వారిని రప్పించేందుకు రైళ్లు నడపాలని కోరాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టి.. బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు'

Nagavamsi: ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది: సూర్యదేవర నాగవంశీ

Devi Sri Prasad: ఎల్లమ్మ తో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా అరంగేట్రం

రాహుల్ సిప్లిగంజ్ పాట, ఆనీ మాస్టర్ డాన్స్ తో ట్రెండింగ్‌లో అమీర్ లోగ్ సాంగ్

Arjun: అర్జున్ చిత్రం సీతా పయనం నుంచి బసవన్న యాక్షన్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండెకి ఈ పండ్లు ఆరోగ్యం

అల్పాహారం, ఒత్తిడి, రాత్రిపూట నిద్ర... మధుమేహంతో లింక్

హైదరాబాద్‌లో తమ 25 ఏళ్ల కార్యకలాపాలను వేడుక జరుపుకున్న టిబిజెడ్-ది ఒరిజినల్

ఈ నూతన సంవత్సరంలో సాధారణ అలవాట్ల కోసం పెద్ద తీర్మానాలను చేసుకున్న అనన్య పాండే

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

తర్వాతి కథనం
Show comments