ATM నుంచి డబ్బు విత్ డ్రా చేస్తున్నారా? ఇక ఛార్జీల మోత మోగుతుంది

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2022 (12:23 IST)
ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని అన్ని ప్రధాన బ్యాంకులు ప్రతి నెలా పరిమిత సంఖ్యలో ఏటీఎంల నుంచి ఉచిత డబ్బు లావాదేవీలను అనుమతిస్తాయి. ఇకపై ఉచిత నెలవారీ లావాదేవీలకు సంబంధించి అనుమతించదగిన పరిమితికి మించి ATMలను ఉపయోగిస్తే ఛార్జీలు విధిస్తారు. గత ఏడాది జూన్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 1 జనవరి 2022 నుండి అమలులోకి వచ్చే నెలవారీ ఉచిత లావాదేవీ పరిమితికి మించి ఏటీఎంల నుంచి నగదు డ్రా చేస్తే ప్రతి లావాదేవీకి రూ. 21 ఛార్జ్ చేయడానికి బ్యాంకులు అనుమతించబడ్డాయి.

 
ఇంతకుముందు బ్యాంకులు అటువంటి ప్రతి లావాదేవీకి రూ 20 వసూలు చేయడానికి అనుమతించబడ్డాయి. వినియోగదారులకు ప్రతి నెలా వారి బ్యాంక్ ATMలలో ఐదు ఉచిత లావాదేవీలు అనుమతి వుంది. అలాగే ఇతర బ్యాంక్ ATMలకు పరిమితి మూడు ఉచిత లావాదేవీలు. నాన్-మెట్రో కేంద్రాల్లోని కస్టమర్లు ఇతర బ్యాంకు ATMలలో ఐదు ఉచిత లావాదేవీలను పొందవచ్చు.

 
1 ఆగస్టు 2022 నుండి అన్ని కేంద్రాలలో ఆర్థిక లావాదేవీకి రూ. 17, ప్రతి ఆర్థికేతర లావాదేవీకి రూ. 6 ఇంటర్‌చేంజ్ రుసుమును విధించడానికి బ్యాంకులను ఆర్బీఐ అనుమతించింది. పెరుగుతున్న ఏటీఎం నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా బ్యాంకులు ఏటీఎం సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తాయి. కస్టమర్ కలిగి ఉన్న కార్డ్ రకాన్ని బట్టి అన్ని ప్రధాన బ్యాంకులు డెబిట్ కార్డ్‌లపై వార్షిక రుసుమును కూడా వసూలు చేస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments