ఆఖరి కోరిక తీరకుండానే వేణు మాధవ్ కన్నుమూత... (video)

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (14:05 IST)
హాస్య నటుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నవ్వులు పూయించిన వేణు మాధవ్ మరణం తెలుగు సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన సెప్టెంబరు 6వ తేదీన యశోధ ఆసుపత్రిలో చేరారు. కాలేయంతో పాటు రెండు కిడ్నీలు కూడా దెబ్బతినడంతో ఆయన పరిస్థితి క్షీణించింది. దీంతో బుధవారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 
 
హాస్యనటుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో నటించి నవ్వించిన వేణు మాధవ్ నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగానూ ఎదగాలని భావించారు. ఇందుకుగాను తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ గెలుపు కోసం ప్రచారం కూడా నిర్వహించారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి తన సొంత నియోజకవర్గం కోదాడ నుంచి పోటీ చేయాలనుకున్నారు. 
 
ఇందుకోసం తెలుగుదేశం అధినాయకత్వాన్ని ఒప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనకు సీటు రాలేదు. దీనితో 2018లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నామినేషన్ కూడా వేశారు. కానీ నామినేషన్ పత్రాలు సరిగా లేవంటూ ఎన్నికల అధికారి తిరస్కరించారు. అలా ఆయన కోరుకున్నది నెరవేరకుండానే కన్నుమూశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments