Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఖరి కోరిక తీరకుండానే వేణు మాధవ్ కన్నుమూత... (video)

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (14:05 IST)
హాస్య నటుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నవ్వులు పూయించిన వేణు మాధవ్ మరణం తెలుగు సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన సెప్టెంబరు 6వ తేదీన యశోధ ఆసుపత్రిలో చేరారు. కాలేయంతో పాటు రెండు కిడ్నీలు కూడా దెబ్బతినడంతో ఆయన పరిస్థితి క్షీణించింది. దీంతో బుధవారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 
 
హాస్యనటుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో నటించి నవ్వించిన వేణు మాధవ్ నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగానూ ఎదగాలని భావించారు. ఇందుకుగాను తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ గెలుపు కోసం ప్రచారం కూడా నిర్వహించారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి తన సొంత నియోజకవర్గం కోదాడ నుంచి పోటీ చేయాలనుకున్నారు. 
 
ఇందుకోసం తెలుగుదేశం అధినాయకత్వాన్ని ఒప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనకు సీటు రాలేదు. దీనితో 2018లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నామినేషన్ కూడా వేశారు. కానీ నామినేషన్ పత్రాలు సరిగా లేవంటూ ఎన్నికల అధికారి తిరస్కరించారు. అలా ఆయన కోరుకున్నది నెరవేరకుండానే కన్నుమూశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments