Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రితో పాటు 30 మంది స్నేహితులు.. 12ఏళ్ల బాలికపై రెండేళ్ల పాటు..? లీవిస్తే చాలు..?

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (11:37 IST)
కేరళలో తండ్రి అనుమతితో.. అతడి స్నేహితులు 30 మంది 12ఏళ్ల బాలికపై రెండేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మలప్పురం, సెల్లేరి ప్రాంతానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న బాలిక.. వరుసగా స్కూలుకు సెలవులు పెట్టేది.
 
దీన్ని గమనించిన బాలిక క్లాస్ టీచర్.. పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఆపై ఈ వ్యవహారంపై ఆరా తీసేందుకు పాఠశాల యాజమాన్యంతో పాటు శిశు సంక్షేమ శాఖకు చెందిన అధికారులు రంగంలోకి దిగారు. ఆ సందర్భంగా ఆ బాలిక వద్ద జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ బాలిక చెప్పిన విషయాలు విని అధికారులు షాకయ్యారు. 
 
గత రెండేళ్ల పాటు ఆ విద్యార్థినిపై తండ్రితో పాటు అతడి స్నేహితులు చాలామంది లైంగికంగా దాడి చేశారని తెలియవచ్చింది. పాఠశాల సెలవుల సందర్భంగా ఆ బాలిక ఇంటికి వచ్చే పురుషుల సంఖ్య అధికమని తెలిసింది. 
 
దాదాపు 30 ఏళ్ల దాటిన వ్యక్తులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ జాతీయ దినపత్రిక తెలిపింది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్కో చట్టం కింద ఇద్దరిని అరెస్ట్ చేశారు. విచారణను వేగవంతం చేశారు. బాధితురాలిని శిశు సంక్షేమ కేంద్రానికి పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం