Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేణుమాధవ్‌పై అలాంటి ప్రచారం ఆపండి.. నేను చూసొచ్చాను.. జబర్దస్త్ రాకేష్

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (11:16 IST)
హాస్యనటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా వుందని మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ స్పందించారు. వేణు మాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని.. ఆయన మృతి చెందారని వస్తున్న వార్తలు నిజం కాదన్నారు.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని రాకేష్ ఖండించారు.  వేణుమాధవ్ బాగుండాలని అందరూ కోరుకోవాలని.. దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో దుష్ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
 
ఆయన మన మధ్య లేరని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై రాకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి సోషల్ మీడియా నియంత్రణ పాటించాల్సిందిగా కోరారు. తాను స్వయంగా ఆస్పత్రికి వెళ్లి వేణు మాధవ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నానని.. ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తోందని, కోలుకుంటున్నారని చెప్పారు. 
 
ఆయన చనిపోయారంటూ టీవీల్లో వస్తున్న వార్తలు చూసి వేణు మాధవ్ తల్లి కలత చెందారని వాపోయారు. ఇలాంటి తరుణంలో ఏం చేయాలో తెలియక.. ట్విట్టర్ వీడియో ద్వారా అందరికీ ఈ విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments