Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 35 లక్షల బీఎండబ్ల్యు కారును నదిలో తోసేసిన యువకుడు..(video)

Webdunia
శనివారం, 10 ఆగస్టు 2019 (16:33 IST)
కోపం ఎంతటి అనర్థాన్నయినా సృష్టిస్తుంది. ఈ కోపం కారణంగా ఎన్నో కోల్పోతారు చాలామంది. అలాంటి కోపాన్నే ప్రదర్శించాడు ఓ యువకుడు. కాకపోతే తన కోపాన్ని బీఎండబ్ల్యు కారుపై చూపించాడు. తనకు నచ్చిన బ్రాండ్‌ కారు కొనివ్వలేదని రూ. 35 లక్షలకు పైగా విలువ చేసే కొత్త బీఎండబ్ల్యు కారును నదిలోకి తోసేశాడు.
 
వివరాలను చూస్తే... హరియాణా రాష్ట్రంలో యమునానగర్‌కు చెందిన ఓ భూస్వామి కుమారుడు తనకు ఎంతో ఇష్టమైన జాగ్వర్‌ కారు కొనివ్వాలని తండ్రిని అడిగాడు. కానీ వారు అతడికి జాగ్వార్ కాకుండా బీఎండబ్ల్యు కారును తీసిచ్చారు. ఆ కారు తనకు వద్దని చెప్పినా పట్టించుకోలేదు వారు. దీంతో ఆగ్రహానికి గురైన యువకుడు ఆ కారులో వెళ్లి సమీపంలోని నదిలోకి తోసేశాడు. నదీ ప్రవాహానికి అది అలా కొట్టుకుపోతుండటంతో స్థానికులు అక్కడికి చేరుకుని అతడు చేసిన పనికి ఆశ్చర్యపోయి చూస్తూ వున్నారు. 
 
ఆ తర్వాత అతడి కోపం చల్లారాక గజ ఈతగాళ్లను పిలిపించి మళ్లీ కారును ఒడ్డుకు లాక్కుని వచ్చాడు. ఈ వ్యవహారాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. విషయం పోలీసులకు తెలియడంతో యువకుడుని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments