Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 35 లక్షల బీఎండబ్ల్యు కారును నదిలో తోసేసిన యువకుడు..(video)

Webdunia
శనివారం, 10 ఆగస్టు 2019 (16:33 IST)
కోపం ఎంతటి అనర్థాన్నయినా సృష్టిస్తుంది. ఈ కోపం కారణంగా ఎన్నో కోల్పోతారు చాలామంది. అలాంటి కోపాన్నే ప్రదర్శించాడు ఓ యువకుడు. కాకపోతే తన కోపాన్ని బీఎండబ్ల్యు కారుపై చూపించాడు. తనకు నచ్చిన బ్రాండ్‌ కారు కొనివ్వలేదని రూ. 35 లక్షలకు పైగా విలువ చేసే కొత్త బీఎండబ్ల్యు కారును నదిలోకి తోసేశాడు.
 
వివరాలను చూస్తే... హరియాణా రాష్ట్రంలో యమునానగర్‌కు చెందిన ఓ భూస్వామి కుమారుడు తనకు ఎంతో ఇష్టమైన జాగ్వర్‌ కారు కొనివ్వాలని తండ్రిని అడిగాడు. కానీ వారు అతడికి జాగ్వార్ కాకుండా బీఎండబ్ల్యు కారును తీసిచ్చారు. ఆ కారు తనకు వద్దని చెప్పినా పట్టించుకోలేదు వారు. దీంతో ఆగ్రహానికి గురైన యువకుడు ఆ కారులో వెళ్లి సమీపంలోని నదిలోకి తోసేశాడు. నదీ ప్రవాహానికి అది అలా కొట్టుకుపోతుండటంతో స్థానికులు అక్కడికి చేరుకుని అతడు చేసిన పనికి ఆశ్చర్యపోయి చూస్తూ వున్నారు. 
 
ఆ తర్వాత అతడి కోపం చల్లారాక గజ ఈతగాళ్లను పిలిపించి మళ్లీ కారును ఒడ్డుకు లాక్కుని వచ్చాడు. ఈ వ్యవహారాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. విషయం పోలీసులకు తెలియడంతో యువకుడుని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments