Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.18.70 కోట్లు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు శోభాయమానంగా జరిగాయి. ఆదివారం ఉదయంతో జరిగిన చక్రస్నానంతో ఈ వేడుకలు ముగిశాయి. ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణపై తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. బ్రహ్మోత్

Webdunia
ఆదివారం, 1 అక్టోబరు 2017 (20:02 IST)
శ్రీవారి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు శోభాయమానంగా జరిగాయి. ఆదివారం ఉదయంతో జరిగిన చక్రస్నానంతో ఈ వేడుకలు ముగిశాయి. ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణపై తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.18.70 కోట్లుగా వచ్చినట్టు చెప్పారు. 
 
భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహన సేవలు, మూలవిరాట్ దర్శనం కల్పించామని చెప్పారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సూచనలు చేశారని తెలిపారు. 
 
ఈ బ్రహ్మోత్సవాల్లో 6.27 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని, రూ.18.70 కోట్ల హుండీ ఆదాయం లభించిందని, గత ఏడాదితో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య, హుండీ ఆదాయం తగ్గిందన్నారు. 
 
23 లక్షల మందికి అన్న ప్రసాదం, 26.55 లక్షల లడ్డూలు పంపిణీ చేశామని,3.06 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని తెలిపారు. 
 
ఈ నెల 18, 25 తేదీల్లో నాలుగు వేల మంది వయోవృద్ధులు, వికలాంగులకు, ఈ నెల 19, 26 తేదీల్లో ఐదేళ్లలోపు చిన్నారుల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments