Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నక్కల వేట ఎంత సేపు.. కుంభస్థలాన్ని బద్ధలకొడదాం.. 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (11:27 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలు. అజయ్ దేవగన్, సముద్రఖనిలు ప్రత్యేక పాత్రలను పోషిస్తున్నారు. అలియా భట్ హీరోయిన్. ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూసిన వారికి రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. "భీమ్... ఈ నక్కల వేట ఎంత సేపు.. కుంభస్థలాన్ని బద్ధలుకొడదాం పదా.." అంటూ చెర్రీ చెబుతున్న డైలాగ్ ఓ రేంజ్‌లో ఉంది. 
 
ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్‌లు నటిస్తున్నారు. ఈ ఇద్దరికి సంబంధించిన విజువల్స్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ చివరులో చెర్రీ చెప్పే డైలాగ్ ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తోంది. 
 
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కించగా, జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకుల చేత నాట్యం చేయిస్తున్న విషయం తెల్సిందే. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

హైదరాబాద్ - విజయవాడ మార్గంలో టికెట్ ధరల తగ్గింపు

రూ.5 కోట్ల విలువైన 935.611 కిలో గ్రాముల గంజాయి స్వాధీనం.. EAGLE అదుర్స్

ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇస్తాం : మంత్రి కొల్లు రవీంద్ర

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments