Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీస్ ఎన్టీఆర్ పార్ట్-2 తీస్తానని వర్మ ప్రకటన..

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (17:53 IST)
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం హైడ్రామాల మధ్య ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మినహా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఎన్నో విమర్శలు మరెన్నో వివాదాలు కోర్టులు, కేసులు అనంతరం ఈ సినిమా మే 1వ తేదీన ఏపీలో కూడా విడుదల కాబోతుంది.
 
ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీకి వెళ్లిన వర్మను అక్కడ పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఆపై వర్మను హైదరాబాద్‌కు బలవంతంగా పంపేయగా, వర్మ ఈ వివాదాలకు సంబంధించి ఈరోజు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టారు. 
 
ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. త్వరలో లక్ష్మీస్ ఎన్టీఆర్ పార్ట్-2 చిత్రాన్ని కూడా తీస్తానని వెల్లడించారు. కాగా పార్ట్-1లో ఎన్టీఆర్ చనిపోయేంతవరకు చూపించిన వర్మ పార్ట్-2లో ఏమి చూపిస్తారనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగానూ, సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..

మా బావే... వీడు చస్తేనే మా అక్క ప్రశాంతంగా ఉంటుంది..

నేడు బీహార్ సర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments