Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీస్ ఎన్టీఆర్ పార్ట్-2 తీస్తానని వర్మ ప్రకటన..

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (17:53 IST)
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం హైడ్రామాల మధ్య ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మినహా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఎన్నో విమర్శలు మరెన్నో వివాదాలు కోర్టులు, కేసులు అనంతరం ఈ సినిమా మే 1వ తేదీన ఏపీలో కూడా విడుదల కాబోతుంది.
 
ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీకి వెళ్లిన వర్మను అక్కడ పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఆపై వర్మను హైదరాబాద్‌కు బలవంతంగా పంపేయగా, వర్మ ఈ వివాదాలకు సంబంధించి ఈరోజు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టారు. 
 
ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. త్వరలో లక్ష్మీస్ ఎన్టీఆర్ పార్ట్-2 చిత్రాన్ని కూడా తీస్తానని వెల్లడించారు. కాగా పార్ట్-1లో ఎన్టీఆర్ చనిపోయేంతవరకు చూపించిన వర్మ పార్ట్-2లో ఏమి చూపిస్తారనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగానూ, సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments