Webdunia - Bharat's app for daily news and videos

Install App

వనితా విజయకుమార్ ఇంట విషాదం: గుండెపోటుతో అక్క కుమార్తె మృతి

Webdunia
శుక్రవారం, 15 అక్టోబరు 2021 (15:58 IST)
కోలీవుడ్ నటి వనితా విజయకుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె అక్క కూతురు అనిత గుండెపోటుతో మరణించింది. ఈ విషయాన్ని వనితా విజయ్ కుమార్ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. 
 
ఈ ఉదయాన్నే ఈ విషాదకర వార్తతో నిద్రలేచాను.. నా మేనకోడలు అనిత (20) మరణించింది. న్యూఢిల్లీలో సర్జరీ చేసుకున్న తర్వాత ఆమెకు గుండెపొటు రావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. నాకు దేవుడిచ్చిన కూతురు తను.. నాకు పెద్ద కూతురు వంటిది. 
 
మా నాన్న సోదరుడి కూతురు ఇంద్ర.. వాళ్లు ప్రస్తుతం సింగపూర్‌లో ఉంటున్నారు. ఇంద్ర చిన్న కూతురు అనిత. ఇంద్ర అక్క అంటే మా కుటుంబంలో అందరికి ఇష్టం.. అనిత దయాగుణం కలిగి  ఉండేది.. అన్నింటిని బాగా అర్థం చేసుకుంటుంది. నాకు ఎప్పుడు మద్దతుగా ఉంటుంది.
 
అలాగే నన్ను.. నా పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటానని మాటిచ్చింది.. కానీ మమ్మల్ని విడిచిపోయింది. తన తల్లిదండ్రులు సింగపూర్‌లో ఉండడం వలన తన మృతదేహాన్ని అక్కడికే పంపించాం. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాను. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. మేము ఈ అక్టోబరులో కలుద్దామనుకున్నాం.
 
తనను నా దగ్గరే 2 నెలలు ఉంచుకుందామనుకున్నాను. కరోనా లాక్డౌన్ కంటే ముందుగా గత రెండేళ్ల నుంచి కలుద్దామని ప్లాన్ చేస్తున్నాం. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. నా గుండె బద్ధలైది అంటూ పోస్ట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Opal Suchata: థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాటాకు మిస్ వరల్డ్ టైటిల్

Pawan Kalyan: జూన్ 1 నుండి చౌక ధరలో రేషన్ వస్తువులు.. ఇంటింటికి పంపిణీ చేస్తే?

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రోడ్ సేఫ్టీ: కడపలో అవగాహన కార్యక్రమం

Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments