Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సాంబార్ టేస్టుగా లేదని చెల్లెలుపై కాల్పులు.. జైలులో చిప్పకూడు.. ఎక్కడ?

సాంబార్ టేస్టుగా లేదని చెల్లెలుపై కాల్పులు.. జైలులో చిప్పకూడు.. ఎక్కడ?
, గురువారం, 14 అక్టోబరు 2021 (22:12 IST)
sambar
మద్యం తాగిన మత్తులో ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు. ఇంట్లో సాంబార్ రుచిగా చేయలేదన్న చిన్న సాకుతో.. తల్లి, సోదరిపై కాల్పులు జరిపారు. దీంతో వారు స్పాట్‌లోనే చనిపోయారు. ఈ అత్యంత దారుణ ఘటన కర్ణాటక జరిగింది. మృతులను సిద్ధాపుర్ తాలుకాలోని దోడ్​మణె గ్రామానికి చెందిన పార్వతీ నారాయణ హస్లార్​(42), ఆమె కుమార్తె రమ్యా నారాయణ హస్లార్​(19)గా పోలీసులు గుర్తించారు.
 
వివరాల్లోకి వెళ్తే.. పార్వతి కుమారుడు మంజునాథ హస్లార్​(24).. మద్యానికి విపరీతంగా బానిసయ్యాడు. పొద్దున్న లేచిన దగ్గర్నుంచి తాగుడు మీదే ద్యాస ఉండేది. బుధవారం రాత్రి అన్నం వడ్డించిన సమయంలో… సాంబార్ రుచిగా లేదంటూ తల్లి, సోదరితో అతడు గొడవకు దిగాడు. 
 
వంట వండటం కూడా రావడం లేదు బూతులు తిట్టాడు. ఈ క్రమంలో తల్లి, సోదరి కూడా ఘాటుగా బదులివ్వడంతో.. కోపోద్రిక్తుడైన అతడు.. నాటు తుపాకీతో వారిపై కాల్పులు జరిపాడు. ఘటన జరిగిన సమయంలో మంజునాథ తండ్రి ఇంట్లో లేడని పోలీసులు చెప్పారు. మద్యం మత్తులో
 
దీనిపై సిద్ధాపుర్ పోలీస్ స్టేషన్​లో అతడు కంప్లైంట్ చేశాడని పేర్కొన్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. మద్యపానం వల్ల ఎలాంటి దారుణాలు జరుగుతాయో ఈ ఘటన కళ్లకు కట్టింది. ఇటు అయినవాళ్లని కోల్పోయి.. అతడు ఇకపై జైల్లో చిప్పకూడు తినాల్సిన పరిస్థితి మంజునాథకు వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త తిన్న ప్లేటు, గ్లాసు బయటకు విసిరేసిన భార్య.. ఎందుకో తెలుసా?