Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్ట్రీమింగ్‌లో ఉప్పెన.. అభిమానులు ఖుషీ ఖుషీ..

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (08:41 IST)
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమై బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మించాయి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 12న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. 
 
వంద కోట్ల గ్రాస్‌ను ఇప్పటి వరకు ఈ చిత్రం సాధించిందని చిత్రనిర్మాతలు పేర్కోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టి నటించగా, విజయ్ సేతుపతి ముఖ్య పాత్ర పోషించాడు. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీపై కూడా ఓ క్లారిటీ వచ్చింది. ఉప్పెన ఈనెల 24న స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. దీంతో మరోసారి ఈ సినిమాను మరోసారి మొబైల్స్‌లో చూడోచ్చిని మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. 
 
ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. వైష్ణవ్ తేజ్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఉప్పెన విడుదలకు ముందే క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాను చేశాడు. ఈ సినిమాకు జంగిల్ బుక్ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. 
 
ఈ సినిమా ఓ ఫేమస్ నవల ఆధారంగా తెరకెక్కించాడు క్రిష్. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ నవలను సినిమాగా తెరకెక్కించేందుకు కథలో కొన్ని మార్పులను చేశాడట క్రిష్.
 
ఇక వైష్ణవ్‌ తేజ్‌ నటించిన మొదటి సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో అతనికి సూపర్ క్రేజ్‌ వచ్చింది. దీంతో అతడు తన క్రేజ్‌ను బాగానే క్యాష్‌ చేసుకుంటున్నాడని టాక్. ఇప్పటికే క్రిష్‌ డైరెక్షన్‌లో చేసిన సినిమాకు రూ.75 లక్షలు తీసుకోనున్నాడట వైష్ణవ్. 
 
అయితే అదంతా ఉప్పెన రిలీజ్‌కు ముందు. కానీ తాజాగా ఓ సినిమాకు కమిట్ అయినా వైష్ణవ్.. నిర్మాత భోగవల్లి ప్రసాద్‌ కాంబినేషన్‌లో రానున్న ఓ చిత్రానికి ఏకంగా రూ.2.5 కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. వైష్ణవ్ తన తొలి సినిమా ఉప్పెన కోసం రూ.50 లక్షలు తీసుకున్నాడట.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న (video)

Bakrid 2025: దేశ వ్యాప్తంగా బక్రీద్‌ను జరుపుకుంటున్న ముస్లిం సోదరులు

Sonu Sood: తిరుమలలో చిరు వ్యాపారిని పలకరించిన సోనూ సూద్ (video)

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments