Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

దేవీ
బుధవారం, 23 జులై 2025 (10:59 IST)
Suriya - karuppu
సూర్య నటిస్తున్న తాజా తమిళ సినిమా తెలుగులో కరుప్పు పేరుతో రాబోతుంది. నేడు సూర్య పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను కొద్దిసేపటి కిత్రమే విడుదల చేశారు. ఇందులో సూర్య పూర్తిగా మాస్ అవతార్‌లో కనిపించాడు. నల్ల చొక్కా, లుంగీ ధరించి, తన లుక్‌కు పాతకాలపు గ్రామీణ ఆకర్షణను తిరిగి తీసుకువస్తాడు. కరుప్పు అంటే తెలుగులో నలుపు అని అర్థం. 
 
టీజర్ పరిశీలిస్తే, కర్పూరం వెలిగించి హారతి ఇస్తే శాంతించే దేవుడుకాదు. మనసులో మొక్కకుని మిరపకాయలు దంచితే రుద్రుడై దిగివచ్చే దేవుడు కాలభైర.. అంటూ కరుప్పు టీజర్ ప్రారంభమవుతోంది. ఫుల్ యాక్షన్ తోకూడిన ఈ టీజర్ లో సూర్య పోరాటల సన్నివేశాలతో కత్తులు, కటారులతో ఊరిలో కాలభైరవ దేవుడి జాతరలో వచ్చే సన్నివేశంగా వుంది. ఫుల్ ఫ్యాన్స్ కు యాక్షన్ విందుగా వుంటుంది.
 
ఈ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా టీజర్ కనిపిస్తుంది. లాయర్ గెటప్ లో సిగార్ వెలిగించుకూంటూ స్టయిల్ గా వస్తూ.. కోర్టులో మాట్లాడుతూ.. నా పేరు సూర్య, నాకింకో పేరుంది..అంటూ టీజర్ కట్ చేశారు. ఆ తర్వాత కత్తులు, కటారులతో యాక్షన్ సీన్స్ కనిపిస్తుంది. ఆ తర్వాత అరే భాయ్.. ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా..అంటూ సవాల్ విసిరే డైలాగ్ తో సూర్య సక్సెస్ కొడతాడనే గ్యారంటీ ఇస్తున్నట్లుంది. ఇలా సాగిన ఈ టీజర్  సూర్య పుట్టినరోజు సందర్భంగా నేడు విడుదల చేశారు.
 
త్రిష కథానాయికగా నటించింది. నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తాజా తమిళ సంగీత దర్శకుడు సాయి అభ్యాంకర్ సౌండ్‌ట్రాక్‌ను అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments